📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bihar Elections: మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..?

Author Icon By Vanipushpa
Updated: June 2, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది(2025) బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Election) జరగనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ (Election Commission) కసరత్తు చేస్తోంది. రెండు లేదా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలిసింది. దీపావళి (Diwali) (అక్టోబర్ 20), ఛత్‌ పూజ (అక్టోబర్ 28) (Chhath Puja)ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలను షెడ్యూల్‌ చేయనున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా నివేదించింది.

Bihar Elections: మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..?

నవంబర్‌ 22తో ముగియనున్న బీహార్‌ అసెంబ్లీ పదవీకాలం
కాగా, బీహార్‌ అసెంబ్లీ పదవీకాలం నవంబర్‌ 22తో ముగియనుంది. అంతకంటే ముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఈనెలలోనే బీహార్‌ను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. 2020 బీహార్ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఓటింగ్‌ జరిగింది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రెండేళ్లకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. అన్ని విషయాలలో బీజేపీదే పై చేయి కావడంతో ఆ కూటమిని వదిలేసి 2022లో ఆర్జేడీ పంచన చేరి నితీశ్‌ తన పదవిని నిలబెట్టుకున్నారు.

Read Also: Pakistan: భారత్ పై పాక్ ప్రయోగించిన చైనా క్షిపణి

#telugu News Ap News in Telugu Bihar Elections Breaking News in Telugu Google News in Telugu in three phases..? Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.