Farmers strike on February 12: ఫిబ్రవరి 12న ‘భారత్ బంద్

Read Time:  1 min
Farmers strike on February 12: ఫిబ్రవరి 12న ‘భారత్ బంద్
FONT SIZE
GET APP

Farmers strike on February 12: అమెరికా-భారత్ ట్రేడ్ డీల్‌ను నిరసిస్తూ దేశవ్యాప్త బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 12న భారత్ బంద్ నిర్వహించనున్నట్లు అఖిల భారత కిసాన్ సభ (AIKS), సంయుక్త కిసాన్ మోర్చా (SKM) స్పష్టం చేశాయి. ఈ ఒప్పందం వల్ల భారతీయ రైతులు, పాడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Cordon Search ASP Deeksha: నెల్లూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్..35 వాహనాలు సీజ్

అమెరికా డీల్‌తో రైతులపై పెను దెబ్బ?

అమెరికా–భారత్ మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందం వల్ల విదేశీ బహుళజాతి సంస్థలకు భారీగా సుంకాలు తగ్గుతాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనివల్ల విదేశీ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి విచ్చలవిడిగా ప్రవేశించి, స్థానిక వ్యవసాయ, పాడి మార్కెట్లను దెబ్బతీస్తాయని వారు వాదిస్తున్నారు. దేశీయ వ్యవసాయ మార్కెట్లు అమెరికా కంపెనీల పరమవుతాయని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాప్త నిరసనలకు పిలుపు

ఈ బంద్‌లో భాగంగా దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అన్ని రాష్ట్రాల్లోని రైతులు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తామని నేతలు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.