Bengaluru: వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు

Read Time:  1 min
Bengaluru
Bengaluru
FONT SIZE
GET APP

బెంగళూరులోని(Bengaluru) కేఏఎస్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న పనిమనిషి ఇంట్లో నిద్రిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను తట్టుకోలేక ఆమె మృతి చెందగా, అనంతరం అదే గదిలో పనిమనిషి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read Also:Telangana: గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళూరుకు చెందిన ఈ కుటుంబం కేఏఎస్ కాలనీలో నివాసం ఉంటోంది. ఇంటి యజమాని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తుండగా, వారి 26 ఏళ్ల కుమార్తె ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తమిళనాడుకు చెందిన దేవరాజు (45) అనే వ్యక్తి గత పదేళ్లుగా ఈ కుటుంబంలో పనిమనిషిగా పనిచేస్తున్నాడు. తొలుత సమీప హాస్టల్‌లో ఉంటూ పని చేసిన దేవరాజుపై నమ్మకం పెరగడంతో కుటుంబ సభ్యులు అతడిని ఇంట్లోనే ఉండేందుకు అనుమతించారు. సాధారణంగా అతడు ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత రాత్రి హాల్‌లో నిద్రించేవాడు.

శనివారం(Bengaluru) అర్ధరాత్రి సమయంలో దుబాయ్ నుంచి ఇంటి యజమాని తిరిగి వచ్చాడు. కాలింగ్ బెల్‌కు స్పందన లేకపోవడంతో కుమార్తెకు ఫోన్ చేయగా, పై అంతస్తులో నిద్రిస్తున్న ఆమె వచ్చి తలుపు తెరిచింది. ఇంట్లోకి వెళ్లిన యజమానికి దేవరాజు కనిపించకపోవడంతో బెడ్‌రూమ్‌ వైపు వెళ్లగా, బెడ్‌పై అచేతన స్థితిలో ఉన్న భార్యను, అదే గదిలో ఉరితాడుకు వేలాడుతున్న దేవరాజును చూసి షాక్‌కు గురయ్యాడు.

ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో అత్యాచారమే వృద్ధురాలి మృతికి కారణమై ఉండొచ్చని, ఆ తరువాత భయంతో దేవరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.