📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL2025: అమల్లోకి బీసీసీఐ కొత్త రూల్స్‌..ఏంటి ఆ నియమాలు!

Author Icon By Anusha
Updated: March 27, 2025 • 3:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(ఐపిఎల్ ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. 18వ సీజన్‌ కోసం బీసీసీఐ కొత్తగా మూడు నిబంధనలను తీసుకురావడం విశేషం. అందులో ముఖ్యమైనది ‘రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి’ అనే రూల్. ఈ రూల్‌ను బుధవారం రాజస్థాన్ రాయల్స్ – కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి అమలు చేశారు. అయితే, కొత్త బంతిని తీసుకున్నా రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించలేకపోయింది. కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్ హైలైట్స్

కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ రాయల్స్‌ కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో బంతిని మార్చాలని అంపైర్లను కోరింది. కొత్త బంతిని తీసుకున్నాకేకేఆర్‌ చేతిలో రాజస్థాన్‌ పరాజయం పాలైంది. రాజస్థాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. ఈ మ్యాచ్‌లో క్వింటన్‌ డికాక్‌ 61 బంతుల్లో 97 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో కోల్‌కతా ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

ఎనిమిది వికెట్ల తేడా

కేకేఆర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ అజేయంగా 97 పరుగులు చేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లు వరుణ్‌ 17 పరుగులకు రెండు, మోయిన్‌ అలీ 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కేకేఆర్‌ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మొయిన్ అలీ (5), కెప్టెన్ అజింక్య రహానే (18) వికెట్లను త్వరగానే కోల్పోయిన కేకేఆర్‌ను.. రఘువంశి (22)తో కలిసి క్వింటన్‌ డికాక్‌ గెలిపించాడు. డికాక్‌ 61 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఎనిమిది బౌండరీల సహాయంతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

రెండవ బంతి రూల్

బీసీసీఐ సెకండ్‌ బాల్‌ రూల్‌ని పరిచయం చేసింది. సాయంత్రం జరిగే మ్యాచులకు రెండో ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ నుంచి కొత్త బంతి ఇస్తారు. అయితే, ఆన్ ఫీల్డ్ అంపైర్లు మంచును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కొత్త బంతి ఇవ్వాలా,వ‌ద్దా,అనే నిర్ణయం తీసుకుంటారు. ఈ రూల్‌ మధ్యాహ్నం మ్యాచ్‌లకు వర్తించదు. రాత్రి మ్యాచుల్లో మంచు ప్రభావాన్ని తగ్గించే విషయంలో సెకండ్‌ బాల్‌ రూల్‌ని ప్రవేశపెట్టింది.

బ్యాట్స్ మ్యాన్

మంచు కారణంగా బౌలర్లు బంతిని పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఇది బ్యాట్స్ మ్యాన్ కు, టార్గెట్ సయయంలో వారికి భారీ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బీసీసీఐ రాత్రి మ్యాచుల్లో రెండో బంతిని ఉపయోగించడానికి అనుమతించే రూల్ ను బీసీసీఐ తీసుకువచ్చింది. రూల్ ప్రకారం రెండవ ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత మైదానంలో ఉన్న అంపైర్ బంతి పరిస్థితిని అంచనా వేస్తారు. అధిక మంచు కురుస్తున్నట్లు గుర్తిస్తే,ఫీల్డింగ్‌ జట్టుకు కొత్త బంతిని ఉపయోగించేందుకు అనుమతి ఇస్తారు.

#CricketLovers #IndianPremierLeague #IPL18 #IPL2025 #RRvsKKR #SecondBallRule #t20cricket Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.