📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ పై వేటు

Author Icon By Anusha
Updated: April 17, 2025 • 2:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్టాఫ్‌లో భాగమైన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్, తెలుగు తేజం టీ దిలీప్‌లపై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. కోచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ జాతీయ దినపత్రిక పేర్కొంది.ఇప్పటికే జట్టులో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ఉండటతో అభిషేక్ నాయర్ అవసరం జట్టుకు లేదనే భావనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్య జట్టు పతనాన్ని శాసించింది. ఈ సిరీస్‌ను భారత్ 1-3తో కోల్పోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ చేజారింది.

అధికారిక ప్రకటన

2024 టీ20 ప్రపంచకప్ విజయంతో రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియగా,ఎనిమిది నెలల కిందట గౌతమ్‌ గంభీర్ ప్ర‌ధాన‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అభిషేక్‌ నాయర్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా బీసీసీఐ నియమించిన విష‌యం తెలిసిందే. అభిషేక్‌, దిలీప్ స్థానంలో ఇంకా ఎవరినీ నియమించకపోవడంతో అసిస్టెంట్ కోచ్ గా ఉన్న‌ ర్యాన్ టెన్ డెస్కాట్ ఇప్పుడు వారి బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించే అవ‌కాశం ఉంది. సోహమ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లె రౌక్స్ ను తీసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.  ఈయ‌న ప్రస్తుతం ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ట్రైనింగ్ స్టాఫ్ స‌భ్యుడిగా ఉన్నాడు.ఈ క్రమంలోనే ఈ సిరీస్‌కు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన అభిషేక్ నాయర్‌పై వేటు వేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ స్థానంలో మరో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కటే బాధ్యతలు చేపడుతాడని ప్రచారం జరుగుతోంది. అయితే కోచ్‌ల మార్పు విషయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సంఖ్య ఎక్కువ

గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఆసీస్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. కానీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఈ విజయంతో గంభీర్‌కు ఉపశమనం లభించింది. అయినా కోచింగ్ స్టాఫ్ సంఖ్య ఎక్కువగా ఉందని, ఈ సంఖ్యను కుదించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీ దిలీప్ పర్యవేక్షణలో టీమిండియా ఫీల్డింగ్ చాలా మెరుగైంది. అయినా అతన్ని ఎందుకు తప్పిస్తున్నారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.

Read also:IPL 2025: రాజస్థాన్ ఓటమి పై స్పందించిన సంజు శాంసన్

#AbhishekNayar #BCCINews #CoachingStaffChanges #GautamGambhir #IndianCricket #TeamIndia Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.