Telugu News: Bangalore:డెలివరీ బాయ్ ని కారుతో ఢీ కొట్టిన దంపతులు 

Read Time:  1 min
Bangalore
Bangalore
FONT SIZE
GET APP

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో(Bangalore) ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న గొడవకు కారణమైన బైక్ రైడర్‌ను కారులోని దంపతులు వెంటాడి మరీ ఢీకొట్టడంతో, ఆ యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు.

Read Also: Womens World Cup 2025: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

Bangalore

ప్రమాదం, గొడవ వివరాలు

బెంగళూరుకు చెందిన డెలివరీ బాయ్ దర్శన్, (Delivery boy Darshan) తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ఈ నెల 22న అర్ధరాత్రి శ్రీరామ లేఅవుట్లో బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో, ఓ కారు పక్క నుంచి వెళుతుండగా, సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలింది. దీంతో కారులో ఉన్న మనోజ్ కుమార్ మరియు ఆయన భార్య ఆరతి శర్మ బైకుపై ఉన్న దర్శన్‌తో గొడవకు దిగారు. కొద్దిసేపటి తర్వాత దర్శన్ అక్కడి నుంచి వెళ్లిపోగా, మనోజ్, ఆరతి తమ కారులో అతడిని వెంటాడారు. దాదాపు 2 కిలోమీటర్లు వెంటాడి, బైక్‌ను వెనక నుంచి బలంగా ఢీకొట్టారు.

మరణం, ఆధారాలు చెరిపే ప్రయత్నం

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్‌లను స్థానికులు ఆసుపత్రిలో(hospital) చేర్పించారు. చికిత్స పొందుతూ దర్శన్ చనిపోగా, వరుణ్ కోలుకుంటున్నాడు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ముందు భాగంలో పడిపోయిన కొన్ని పార్టులను, మనోజ్ మరియు ఆరతి మాస్కులు ధరించి వెనక్కి వచ్చి పట్టుకెళ్లారు. వరుణ్ ఫిర్యాదు మేరకు జేపీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా, దంపతుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు మనోజ్ మరియు ఆరతిలను బుధవారం అరెస్టు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.