పవిత్రమైన అయోధ్య రామ మందిర సమీపంలోని ఓ గెస్ట్హౌజ్లో జరిగిన ఈ ఘటన నిజంగా దేశం మొత్తం సంచలనం సృష్టించింది. రామ మందిర దర్శనం కోసం వెళ్లిన వారందరికీ ఇది ఒక భయాన్ని కలిగించే సంఘటన. ఓ గస్ట్హౌజ్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మహిళా భక్తురాలు బాత్రూంలో స్నానం చేస్తుండగా హోటల్ సిబ్బంది ఆమెను వీడియో తీశారు. అయితే విషయం గుర్తించిన మహిళ కేకలు వేయగా కుటుంబ సభ్యులు, తోటి భక్తులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మహిళ స్నానం చేస్తుండగా వీడియో
వివరాల్లోకి వెళ్తే వారణాసి నుండి అయోధ్యకు కుటుంబ సభ్యులతో వెళ్లిన ఓ 30 ఏళ్ల మహిళ శుక్రవారం ఉదయం 6 గంటలకు గెస్ట్ హౌజ్లో ఉన్న బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లింది. అయితే హడావుడిగా స్నానం చేయబోతున్న ఆమెకు తనను ఎవరో గమనిస్తున్నట్లు అనిపించింది. వెంటనే బాత్రూం మొత్తాన్ని నిశితంగా పరిశీలించగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. హోటల్లో పని చేసే ఓ యువకుడు తాను స్నానం చేస్తుండగా వీడియో తీయడాన్ని గమనించింది. దీంతో భయపడిపోయిన ఆమె కేకలు వేయడంతో ఆమె కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు హుటాహుటిన రంగంలోకి వచ్చారు. పారిపోయేందుకు ప్రయత్నించిన యువకుడిని వారు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడి వద్ద ఉన్న ఫోన్ను స్వాధీనం చేసుకుని, ఆ ఫోన్లో మరెంత మంది మహిళల వీడియోలు ఉన్నాయా అనేది పరిశీలించారు. వారు చెబుతున్న ప్రకారం, అనేక ఇతర మహిళల వీడియోలు కూడా అతడి ఫోన్లో ఉన్నాయని తెలిపారు.
నిందితుడు వివరాలు
నిందితుడి పేరు సౌరభ్ తివారీ అని, ప్రస్తుతం అతడు అదే గెస్ట్హౌజ్లో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్లోని బహ్రైచ్కు చెందిన అతడు చాలా రోజులుగా అక్కడే పని చేస్తూ ఎవరికీ తెలియకుండా మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తున్నాడు. కానీ తాజాగా మహిళ గుర్తించడం అతడి బాగోతం బయట పడింది. ఈ విషయం కాస్తా వెలుగులోకి రావడంతో గతంలో అయోధ్య వెళ్లిన వారంతా భయాందోళనకు గురవుతున్నారు. తమ వీడియో కూడా తీశాడేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం అయిన అయోధ్యలో, భక్తులు తమ ఆధ్యాత్మిక పర్యటనను పూజలతో, దేవాలయ దర్శనంతో పూర్తిచేయాలని ఆశపడతారు. కానీ ఈ ఘటనతో భక్తులు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు.