శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య ఇప్పుడు భక్తిశ్రద్ధలతో నిండిపోయింది. ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినం ఎంతో వైభవంగా జరుగుతుంది కానీ ఈ సారి అది మరింత ప్రత్యేకంగా మారింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రసారాలతో ప్రపంచ వ్యాప్తంగా రామ భక్తులను ఆకట్టుకుంటోంది.

ఈ ఏడాది శ్రీరామనవమిని పురస్కరించుకుని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం అందంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుద్దీపాలు, పుష్పాల తండాలు, పటాకులు, దేవతా రూపాల ఏర్పాట్లు ఆలయానికి కొత్త జీవాన్ని నింపాయి. భక్తులు చూసేందుకు రెండు కన్నులైనా చాలవంటుంది. అయోధ్య ప్రధాన వీధులన్నీ ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో మెరిసిపోతున్నాయి. ఆలయ ద్వారాలు, టెంపుల్ స్ట్రీట్లు, ప్రధాన రథం మార్గాలు. శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించిన ఏడవ అవతారం. సూర్య వంశానికి చెందిన దశరథ మహారాజుకు జన్మించిన రాముడు, అబిజిత్ ముహుర్తంలో జన్మించినట్లు పురాణాలు పేర్కొంటాయి. నవమి తిథి రోజున శ్రీరాముడు జన్మించాడు. అదే రోజున సీతారాముల కళ్యాణం జరిగింది, 14 ఏళ్ల అరణ్యవాసానంతరం పట్టాభిషేకం కూడా అదే తిథి ఈ కారణంగా నవమి తిథి రామ భక్తులకు అత్యంత పవిత్రమైనది. ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పవిత్ర ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీంతో ప్రపంచం నలుమూలలలోని భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ ఘట్టాన్ని వీక్షించే అవకాశాన్ని పొందనున్నారు.
సూర్య తిలకం
ఈ శ్రీరామనవమికి మరొక ప్రధాన ఆకర్షణ సూర్య తిలకం. మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాలరాముని నుదిటిపై కచ్చితంగా పడతాయి. ఇది దాదాపు నాలుగు నిమిషాల పాటు ఉంటుందని అంచనా. ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇది భక్తి, విజ్ఞానం, శాస్త్రం మేళవించిన అద్భుతం. శ్రీరామనవమి సందర్భంగా అన్ని ఆలయాల్లో శ్రీ సీతారముల కల్యాణం నిర్వహిస్తున్నారు.