हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Latest Telugu News: Pooja Paul అఖిలేష్ యాదవ్ వ్యూహం… బీజేపీకి షాక్!

Vanipushpa
Latest Telugu News: Pooja Paul అఖిలేష్ యాదవ్ వ్యూహం… బీజేపీకి షాక్!

సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్‌ను బహిష్కరించడం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ అంశం ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా అఖిలేష్ యాదవ్‌కు ఒక కొత్త వ్యూహాత్మక అస్త్రంగా మారింది. పూజా పాల్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడి.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పీడీఏ (Pichda, Dalit, Alpsankhyak) ఫార్ములాను విమర్శించారు. దీనికి ప్రతిగా అఖిలేష్ యాదవ్ తన పార్టీ నాయకులను రంగంలోకి దింపి బీజేపీని ఓబీసీ వ్యతిరేక పార్టీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కౌశాంబిలోని చైల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పూజా పాల్.. ఇటీవల బీజేపీకి మద్దతు తెలుపుతూ సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. బీజేపీ పూజా పాల్‌ను తమ వైపు లాక్కుని, పాల-గడారియా, బఘేల్ వర్గాలను ఆకర్షించి.. అఖిలేష్ యాదవ్ పీడీఏ ఫార్ములాను దెబ్బతీయాలని భావించింది.

Pooja Paul అఖిలేష్ యాదవ్ వ్యూహం… బీజేపీకి షాక్!
Pooja Paul అఖిలేష్ యాదవ్ వ్యూహం… బీజేపీకి షాక్!

బహిష్కరణ అనంతరం పూజా పాల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అఖిలేష్ యాదవ్‌కు రాసిన లేఖలో.. సమాజ్‌వాదీ పార్టీ పీడీఏ ఫార్ములాను.. ‘కుటుంబం’ (Parivar), ‘నేర చరిత్ర’ (Dagi), ‘అపరాధి’ (Apradhi) అని పేర్కొన్నారు. తన భర్త హత్య జరిగినప్పుడు కూడా ఎస్పీ అధికారంలో ఉందని, ఇప్పుడు ఆ పార్టీ పోషించిన మాఫియా గ్యాంగ్ తనను కూడా చంపవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

అఖిలేష్ వ్యూహాత్మక దాడి
పూజా పాల్ ఆరోపణలకు అఖిలేష్ యాదవ్ నేరుగా స్పందించారు. “ముఖ్యమంత్రిని కలిసిన వ్యక్తికి వేరే పార్టీ నాయకుడి వల్ల ప్రాణహాని ఎలా ఉంటుంది?” అని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక బీజేపీ ఉందని, పూజా పాల్‌ను ఒక పావుగా వాడుకొని తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. ఒకవేళ ఆమెకు ఏదైనా జరిగితే, తమ పార్టీ నాయకులను జైలుకు పంపించే కుట్ర బీజేపీ చేస్తోందని ఆయన చెప్పారు. ఈ వివాదాన్ని అఖిలేష్‌ యాదవ్ రాజకీయ అవకాశంగా మార్చుకున్నారు. పీడీఏపై దాడికి దిగిన బీజేపీకి తిరిగి కౌంటర్ ఇవ్వడానికి, ఆయన తన రాష్ట్ర అధ్యక్షుడు శ్యామలాల్ పాల్‌ను రంగంలోకి దింపారు. శ్యామలాల్ పాల్‌తో పాటు, అనేక మంది ఇతర ఓబీసీ నాయకులను కూడా ఆయన రంగంలోకి దింపి, బీజేపీ పాలనలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడించారు.

బీజేపీలోకి పూజా పాల్!

బీజేపీకి ‘మాస్టర్ స్ట్రోక్’ గా మారిన పూజా పాల్ పూజా పాల్‌కు 2005లో ఆమె భర్త రాజు పాల్‌ హత్యకు గురయ్యారు. ఈ కేసులో అతిక్ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్ ప్రధాన నిందితులు. మొదట బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పూజా పాల్, ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఇటీవల ఆమె రాజ్యసభ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేసి, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వపు ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని ప్రశంసించారు. దీంతో ఎస్పీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. బీజేపీ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంది. పూజా పాల్‌ను మహిళా భద్రత, న్యాయం గెలిచింది అనే నినాదాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేస్తోంది. పూజా పాల్ వ్యవహారం ద్వారా, బీజేపీ పాల-బఘేల్ వర్గాలను తమ వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఈ వర్గం ఓబీసీలలో కీలకం కావడంతో పాటు, ఎస్పీకి ఓటు బ్యాంకుగా ఉంది. పూజా పాల్‌ను బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా అఖిలేష్‌ను పాల సమాజానికి వ్యతిరేకిగా చూపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

అఖిలేష్ యాదవ్ తన భార్యను ఎలా కలిశాడు?
డింపుల్ రావత్ విద్యార్థినిగా ఉన్నప్పుడు అఖిలేష్ యాదవ్‌ను కలిశారు. మొదట్లో, యాదవ్ కుటుంబం వారి వివాహానికి వ్యతిరేకం, కానీ అతని అమ్మమ్మ మూర్తి దేవి ఆమోదించిన తర్వాత వారు అంగీకరించారు. ఆమె 21 సంవత్సరాల వయసులో 1999 నవంబర్ 24న ఈ జంట వివాహం చేసుకున్నారు.
భారతదేశంలో శక్తివంతమైన పార్టీ ఏది?
శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ నుండి బిజెపి ఉద్భవించింది. 2014 నుండి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశంలో అధికార రాజకీయ పార్టీగా ఉంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/amit-shah-jagdeep-dhankhar-resignation-reaction/national/535909/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే ఇక పర్మిషన్ కావాల్సిందే!

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే ఇక పర్మిషన్ కావాల్సిందే!

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ. 8,230 పతనం!

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ. 8,230 పతనం!

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: మమతకు ఆధిక్యమేనా?

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: మమతకు ఆధిక్యమేనా?

మోటోరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం

మోటోరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం

కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం

కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం

సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి

సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి

భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

12 రైళ్ల సమయాల్లో మార్పులు.. నేటి నుంచే అమలు

12 రైళ్ల సమయాల్లో మార్పులు.. నేటి నుంచే అమలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు
0:49

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

📢 For Advertisement Booking: 98481 12870