
Baramati News: మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత అజిత్ పవార్(Ajit Pawar Funeral) ప్రస్థానం ముగిసింది. విమాన ప్రమాదంలో అకాల మరణం చెందిన ఆయన పార్థివ దేహానికి బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో గురువారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తమ ప్రియతమ నాయకుడిని కడసారి చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులు మరియు లక్షలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.
Read Also: Ajit Pawar: ఎట్టకేలకు దొరికేసిన ‘బ్లాక్ బాక్స్’.. కొనసాగుతున్న దర్యాప్తు
పోలీసుల గౌరవ వందనం, ప్రభుత్వ లాంఛనాల మధ్య జరిగిన ఈ అంతిమ సంస్కారాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. బారామతి వీధులన్నీ ‘అజిత్ పవార్ అమర్ రహే’ అనే నినాదాలతో మారుమోగాయి. రాజకీయ యోధుడికి వీడ్కోలు పలుకుతూ కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు కన్నీరుమున్నీరయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: