📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Ahmedabad Plane Crash : విమానం తోక భాగంలో మరో మృతదేహం లభ్యం

Author Icon By Anusha
Updated: June 14, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరానికి చెందిన నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.టేకాఫ్ అయన కాసేపటికే విమానం ప్రమాదానికి గురికాగా 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఈరోజే అధికారులు వెల్లడించగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు DNA పరీక్షలు చేస్తుండగా మరోవైపు శిథిలాల్లో ఇంకా ఎవరివైనా మృతదేహాలు ఉన్నాయేమో అని అధికారులు గాలిస్తున్నారు. ఈక్రమంలోనే ఈరోజు ఉదయం విమానంలోని తోక భాగంలో ఓ మృతదేహం లభ్యం అయింది.

ఉంటుందని

అయితే ఈ డెడ్ బాడీ విమాన సిబ్బందిలోని ఒకరిదే అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.తాజాగా లభ్యమైన మృతదేహం ఎవరిదై ఉంటుందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతదేహం విమానం తోక భాగంలో గుర్తించడంతో ఆ విమానంలో విధులు నిర్వర్తించిన ఎయిర్‌హోస్టెస్‌(Air Hostess) దే అయి ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇంకా అధికారికంగా దీన్ని గుర్తించలేకపోయారు. ముఖ్యంగా మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల డీఎన్ఏతో మృతదేహం సరిపోలిన తర్వాత అది ఎవరిదనేది తేలుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానాశ్రయం సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కుప్పకూలిన సంగతి తెలిసిందే.

Ahmedabad Plane Crash

సీనియర్ పైలట్

దీంతో దాదాపుగా విమానం మంటల్లో కాలిపోగా తోకభాగం మాత్రం భవనంపై చిక్కుకుపోయింది.మరోవైపు ప్రమాదానికి ముందు పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటకు వచ్చింది.ఆ మెసేజ్ కేవలం 5 సెకన్లు మాత్రమే ఉంది. అందులో ఎయిరిండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సభ్రావల్ (Sumit Sabharwal), మేడే, మేడే, మేడే, నో పవర్, నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అని మెసేజ్ ఇచ్చారు. ఆ వెంటనే కనెక్షన్ తెగిపోవడం, విమానం కూలిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ ప్రమాదంపై కేంద్ర పౌరవిమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం దిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Read Also: Iran: అమెరికాతో అణు ఒప్పందం మాకు విశ్వాసం లేదన్న ఇరాన్

#AhmedabadPlaneCrash #AirCrash2025 #AirIndiaCrash #GujaratTragedy Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.