📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Ahmedabad Plane Crash: న‌ర్సు మృతి పై.. డిప్యూటీ తహ‌సిల్దార్‌ అనుచిత వ్యాఖ్యలతో సస్పెండ్

Author Icon By Anusha
Updated: June 13, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రానికి

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘోర విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అనేక మందిని అనాథలను చేసింది. ఆ మృతుల్లో కేర‌ళ‌కు చెందిన రంజితా గోప‌కుమ‌ర‌న్ నాయ‌ర్ (Ranjitha Gopakumaran Nair) ఉన్నారు. ఆమె వ‌య‌సు 42 ఏళ్లు. అయితే గ‌వ‌ర్న‌మెంట్ న‌ర్సుగా ప‌నిచేసిన ఆమె లీవ్ తీసుకుని యూకేకు వెళ్లింది. అక్క‌డ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ డ‌బ్బ‌లు సంపాదిస్తోంది. అయితే ఇటీవ‌ల 5 రోజుల లీవ్‌పై ఆమె స్వంత రాష్ట్రానికి వ‌చ్చింది. ఇళ్లు క‌ట్టుకోవాల‌న్న క‌లను నిజం చేసుకునేందుకు ఆమె విదేశీ ఉద్యోగం కోసం బ్రిట‌న్ వెళ్లింది. ఇక ఆ ఇంటి ప‌ని కోస‌మే ఇటీవ‌ల కేర‌ళ‌ (Kerala) కు వ‌చ్చింది. అయితే గురువారం మ‌ళ్లీ బ్రిట‌న్ వెళ్తున్న ఆమె అహ్మ‌దాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానాన్ని ఎక్కింది.

డిప్యూటీ త‌హ‌సిల్దార్‌

ఆ విమాన ప్ర‌మాదంలో రంజితా ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు భ‌ర్త‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.విమాన ప్ర‌మాదంలో చ‌నిపోయిన న‌ర్సు రంజిత‌పై వెల్ల‌రికుండు డిప్యూటీ త‌హ‌సిల్దార్ ఏ ప‌విత్ర‌న్ (A Pavithran) త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. దీంతో జూన్ 13వ తేదీన కాస‌ర‌గ‌డ్ జిల్లా క‌లెక్ట‌ర్ కే ఇన‌బ‌శేఖ‌ర్ డిప్యూటీ త‌హ‌సిల్దార్‌ను స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాద బాధితురాలిపై ప‌విత్ర‌న్ ఫేస్‌బుక్‌లో అనుచిత కామెంట్స్ చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. రెవ‌న్యూ శాఖ‌కు అప‌ఖ్యాతిని తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు. 

Ahmedabad Plane Crash

ఫేస్‌బుక్ అకౌంట్‌

ప‌విత్ర‌న్ త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో కామెంట్ చేస్తూ విమాన ప్రమాద బాధితుల్లో ఓ నాయ‌ర్ మ‌హిళ ఉంద‌ని, ఆమె చ‌నిపోయింద‌ని, కేర‌ళ ప్ర‌భుత్వం (Kerala Government) ఆమెకు ఉద్యోగం ఇచ్చింద‌ని, కానీ ఆమె లీవ్ పెట్టి విదేశాల‌కు వెళ్లింద‌ని, ఆమెకు ద‌క్కాల్సిందే ద‌క్కిన‌ట్లు విమ‌ర్శించాడు. ఆ పోస్టుపై తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. త‌హిసిల్దార్‌ను తొల‌గించాల‌ని ప‌బ్లిక్ డిమాండ్ చేశారు. దీంతో కాస‌ర‌గ‌డ్ క‌లెక్ట‌ర్ అత‌న్ని స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

నిర్మాణ ప‌నులు

2024 సెప్టెంబ‌ర్‌లో కూడా అత‌న్ని క‌లెక్ట‌ర్ స‌స్పెండ్ చేశాడు. క‌న్‌హంగ‌ద్ ఎమ్మెల్యే ఈ చంద్ర‌శేఖ‌ర్ కులంపై కామెంట్ చేసిన కేసులోనూ ప‌విత్ర‌న్‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు.బ్రిట‌న్‌ (Britain) లో ఏడాది నుంచి రంజిత న‌ర్సుగా చేస్తున్న‌ది. ఇంటి నిర్మాణ ప‌నులు చూసేందుకు ఆదివారం ఆమె ఇంటికి వ‌చ్చిన‌ట్లు స్థానికులు చెప్పారు. కేర‌ళ ఆరోగ్య‌శాఖ‌లో ఉద్యోగం సంపాదించిన కార‌ణంగా, బ్రిట‌న్‌లో జాబ్ కాంట్రాక్టును ముగించుకుని త్వ‌ర‌గా కేర‌ళ‌కు రావాల‌న్న ఆలోచ‌న‌లో ఆమె ఉన్న‌ట్లు తెలిసింది.

Read Also: Ahmedabad Plane Crash:కెప్టెన్ సుమీత్‌ మరణంతో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

#DeputyTahsildarSuspended #InsensitiveRemarks #JusticeForRanjitha #RanjithaTragedy Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.