📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Bengaluru Case: మహిళలపై దాడి కేసులో కేరళలో నిందితుడు అరెస్ట్

Author Icon By Vanipushpa
Updated: April 14, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులోని బిటిఎం లేఅవుట్ వద్ద ఒక సందులో ఒక వ్యక్తి ఇద్దరు మహిళలను వెంబడిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరి మహిళల్లో ఓ మహిళలపై ఒక వ్యక్తి దాడి చేసి అఘాయిత్యానాకి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఆ మహిళ ప్రతిఘటించడంతో వారి నుంచి తప్పించుకున్న నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

26ఏళ్ల సంతోష్‌గా గుర్తింపు..
సీపీఫుటేజ్ ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బెంగళూరులోని ఓ జాగ్వార్‌ షోరూమ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న 26ఏళ్ల సంతోష్‌గా గుర్తించారు. ఇక అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా అతను బెంగళూరు నుండి తమిళనాడులోని హోసూర్‌కు పారిపోయినట్టు కనుగొన్నారు. ఆ తర్వాత సేలం, అక్కడి నుంచి కోజికోడ్‌కు పారిపోయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో మూడు రాష్ట్రాల్లోని 700 సీసీకెమెరాలను పరిశీలించిన పోలీసులు చివరకు కేరళలోని ఒక మారుమూల గ్రామంలో అతన్ని పట్టుకోగలిగారు. దాదాపు వారం పాటు కొనసాగిన వేటను ముగించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రాజకీయ వివాదానికి దారితీసిన దాడి
ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర చేసిన దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారి తీశాయి. ఇంతపెద్ద నగరంలో ఇలాంటి ఘటనలు జరగడం సహజమని..అయినా చట్టప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీఅయిన బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళలపై నేరాలను ఆయన సాధారణీకరిస్తున్నారా? ఆయన్న వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

Read Also: Murder: ఆస్తి కోసం మహిళకు మద్యం తాగించి హత్య చేసిన బంధువులు

#telugu News Accused arrested Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Kerala for assault on women Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.