📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

పూణె బస్సులో యువతిపై లైంగికదాడి

Author Icon By Vanipushpa
Updated: February 27, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న యువతి (26)తో మాటలు కలిపిన ఓ వ్యక్తి ఆపై ఆమెను ఖాళీగా ఉన్న బస్సులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని అతిపెద్ద బస్టాండ్‌లలో ఒకటైన స్వర్‌గేట్‌ బస్టాండ్‌లో మొన్న ఉదయం ఆరు గంటల సమయంలో జరిగిందీ ఘటన. బస్టాండ్‌కు 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం.
పోలీసుల కథనం ప్రకారం..
బాధిత యువతి సతారా జిల్లాలోని తన స్వగ్రామం ఫల్టాన్ వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తోంది. ఆమె ఒంటిగా ఉన్న విషయాన్ని గమనించిన నిందితుడు ‘అక్కా’ అని సంబోధిస్తూ మాటలు కలిపాడు. ఆమె ఎక్కడికి వెళ్లేదీ తెలుసుకున్నాడు. ఆ గ్రామానికి వెళ్లే బస్సు ఇక్కడ ఆగదని, మరో చోట ఉందని చెప్పి బస్ స్టేషన్‌లో దూరంగా నిలిపి ఉంచిన బస్ వద్దకు తీసుకెళ్లాడు. అనంతరం బస్సు ఎక్కాలని చెప్పగా, బస్సులో లైట్లు ఆఫ్ చేసి ఉండటంతో ఆమె అనుమానించింది. అది గమనించిన నిందితుడు బస్సులో ప్రయాణికులు ఉన్నారని, నిద్ర పోతుండటంతో లైట్లు ఆఫ్ చేశారంటూ బలవంతంగా ఆమెను బస్సు ఎక్కించాడు. ఆపై తనూ ఎక్కి తలుపు వేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.
పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు
ఆ తర్వాత బాధితురాలు తన ఊరు వెళ్లాల్సిన బస్సు ఎక్కింది. అదే బస్సులో తన స్నేహితురాలిని చూసి జరిగిన విషయం చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె చెప్పడంతో వెంటనే బస్సు దిగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని దత్తాత్రేయ రామదాస్ (36)గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిలుపై ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందన
ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ఇదొక దురదృష్టకర ఘటన అని, బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి వెళ్లడంతో నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశించారని తెలిపారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు
కాగా, ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో నేరాలను అదుపు చేయడంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విఫలమయ్యారని ఆరోపించాయి. ఈ ఘటన 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను తలపించిందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితాలు ఇస్తూ వారి భద్రతను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ శివసేన (యూబీటీ) నేత వసంత్ మోరే, ఇతర నాయకులు స్వర్‌గేట్ బస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన తెలిపారు. కిటికీలను ధ్వంసం చేశారు.

#telugu News A young woman was sexually assaulted Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu in a Pune bus Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.