📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వేళ 32 విమానాశ్రయాలు మూసివేత

Author Icon By Anusha
Updated: May 10, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న పాకిస్థాన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. భారత్‌పై తీవ్రంగా దాడులకు తెగబడుతున్న దాయాది పూర్తిగా ఫ్లాప్ అవుతోంది.పాకిస్థాన్ కు ఊహించని దెబ్బలు తగులుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ వేళ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టటం లో భారత్ సక్సెస్ అయింది.ఆపరేషన్ సింధూర్ వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు, యుద్ద వాతావరణం వేళ పౌర విమాన సేవల పైన ఆంక్షలు విధించింది. పాక్ నుంచి డ్రోన్ల తో దాడులకు ప్రయత్నిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధించిన ఆంక్షలను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఫలితంగా 32 విమానాశ్రయాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం, పలు విమానాలను రద్దు చేసింది. ముందుగా బుక్ చేసుకున్న వారికి పూర్తిగా రీఫండ్ ఇవ్వనున్నట్లు విమానయాన సంస్థలు వెల్లడించాయి.

నిర్ణయం

దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలను గురువారం (మే 15) ఉదయం 5:29 గంటల వరకు మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్తాన్ చేస్తున్న క్షిపణి, డ్రోన్ దాడులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుత సమయంలో, ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే టిక్కెట్లను కలిగి ఉన్న వినియోగదారులందరికీ టికెట్ రద్దుపై(Ticket Cancell) పూర్తి వాపసు విషయంలో ధరపై ఒకేసారి తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది” అని ఏయిర్ ఇండియా పేర్కొంది.ఇప్పటికే శ్రీనగర్‌, చండీగఢ్‌ సహా మొత్తం 32 ఎయిర్‌పోర్టుల్లో పౌర విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశాయి. తొలుత మే10 వరకు రాకపోకలపై ఆంక్షలు విధించగా, తాజాగా మరో ఐదు రోజుల పాటు దానిని పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయా ఎయిర్‌ పోర్టు లకు రాకపోకలు రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. దీంతో జమ్మూ, చండీగఢ్‌ లో చిక్కుకున్న విమాన ప్రయాణికుల(Air passengers)కోసం రైల్వేశాఖ ప్రత్యేకంగా 4 రైళ్లు ఏర్పాటు చేసింది. కేంద్రం సూచనల మేరకు విమాన ప్రయాణాల పైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన విమాన సంస్థలు ప్రయాణీకులు తాజా మార్పులకు అనుగుణంగా సహకరించాలని సూచించాయి.

ఆపరేషన్ సింధూర్ వేళ 32 విమానాశ్రయాలు మూసివేత?

మూసివేసినట్లు

శ్రీనగర్‌, జమ్మూ, అమృత్‌సర్‌, లుథియానా, చండీగఢ్‌, భుంటార్‌, కిషన్‌గఢ్‌, పటియాలా, శిమ్లా, ధర్మశాల, భఠిండా, జైసల్మేర్‌, జోధ్‌పుర్‌, లేహ్‌, బికానేర్‌, పఠాన్‌కోట్‌, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, భుజ్‌, అదంపూర్​, అంబాలా, అవంతిపూర్​, హల్వారా, హిండన్​, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోద్​, కిషన్​గఢ్​, కులు మనాలి (భుంటార్​), ముంద్రా, నలియా, పోర్​బందర్​, సర్సవా, విమానాశ్రయాలను మూసివేసినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ప్రయాణికులు తమ ప్రయాణ తేదీలను ఉచితంగా రీషెడ్యూల్‌ చేసుకునే సదుపాయాన్ని విమానయాన సంస్థలు కల్పిస్తున్నాయి.

Read Also: Nawaz Sharif : భారత్‌తో దూకుడు వద్దు – పాక్‌ ప్రధానికి సూచన!

#AirportClosures #CivilAviationRestrictions #FlightCancellations #IndiaPakistanTensions #Operation Sindoor Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.