ఓ ఆటోలో ఏకంగా 19 మంది వ్యక్తులు ప్రయాణించడం చూసి పోలీసులు విస్మయం చెందారు. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ లో ఈ సంఘటన జరిగింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఫిబ్రవరి 15న రాత్రివేళ బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై వెళుతున్న ఒక ఆటోను పోలీసులు చూశారు. ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో అనుమానం వచ్చి చెక్పాయింట్ వద్ద ఆ ఆటోను ఆపారు.
చట్టపరమైన చర్యలు
అందులో ప్రయాణిస్తున్న వారిని ఒక్కొక్కరిగా కిందకు దిగమని చెప్పి, పోలీసులు లెక్కించారు. దాంతో 19 మంది వ్యక్తులు ఆ ఆటోలో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు నిర్ఘాంతపోయారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు… నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.
ఒక్క ఆటోలో 19 మంది ప్రయాణికులు..
Read Time:
1 min
Tags:
19 passengers
Breaking News in Telugu
Google news
Google News in Telugu
in one auto..
Paper Telugu News
Telugu News online
Telugu News Paper
Telugu News Today
Today news
uttara pradesh
రచయిత గురించి
Vanipushpa
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.