📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట 18 మంది మృతి

Author Icon By Vanipushpa
Updated: February 18, 2025 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫిబ్రవరి 15 రాత్రి 9:55 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభ్ కు రైలు ఎక్కేందుకు ప్రయాణికులలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం వివరాలను పరిశోధించడానికి, రైల్వే మంత్రిత్వ శాఖ ఇద్దరు సీనియర్ రైల్వే అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇది మొత్తం ప్రమాదం వివరాలను పరిశీలిస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కడ నిర్లక్ష్యం, ఎలాంటి పొరపాట్లు జరిగాయో పరిశీలిస్తున్నారు.
ప్లాట్‌ఫామ్‌ మార్చడమే తొక్కిసలాటకు కారణం
ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాటపై RPF నివేదిక ఇచ్చింది. ప్లాట్‌ఫామ్‌ మార్చడమే తొక్కిసలాటకు కారణం ఆర్‌పీఎఫ్‌ స్పష్టం చేసింది. 12వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి శివగంగ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లగానే.. అక్కడికి ప్రయాణికులు పోటెత్తారని తెలిపింది.12, 13, 14, 15,16 ప్లాట్‌ఫామ్‌లు రద్దీగా మారాయి. గంటకు 1500 టికెట్ల విక్రయాన్ని ఆపాలని కోరినట్లు ఆర్‌పీఎఫ్‌ తెలిపింది. స్పెయిల్‌ ట్రెయిన్‌ 12వ ప్లాట్‌ఫామ్‌కు వస్తుందని చెప్పారు..మళ్లీ 16వ నెంబర్‌కు వస్తుందంటూ ప్రకటన చేశారని తన నివేదికలో తెలిపింది. 2,3 నెంబర్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలపైకి వెళ్లడానికి..ప్రయాణికులు మెట్లు ఎక్కుతుండగా తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంది.


దర్యాప్తులో సంచలన విషయాలు
శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. తీవ్రగాయాల పాలైన 18 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌ నుంచి వస్తున్న భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో రైల్వేశాఖ అధికారులు ఘోరంగా విఫలమైనట్టు విమర్శలు వస్తున్నాయి. రైళ్ల రాకపోకలపై తప్పుడు అనౌన్స్‌మెంట్‌ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చివరి నిముషంలో ప్లాట్‌ఫామ్‌ మార్చడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.
విచారణకు ఆదేశం
అంతేకాకుండా ఒకే పేరుతో రెండు రైళ్లు ఉండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వాళ్లను కంట్రోల్‌ చేయడంలో RPF సిబ్బంది విఫలమయ్యారు. వాస్తవానికి ఎక్కువమంది RPF సిబ్బందిని కుంభమేళాకు తరలించడంతో చాలా తక్కువమంది సిబ్బంది ఢిల్లీ స్టేషన్‌లో ఉన్నారు. తొక్కిసలాటపై ఇద్దరు సభ్యుల విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఆర్‌పీఎఫ్‌ నివేదికను సమర్పించింది.

#telugu News 18 killed Ap News in Telugu Breaking News in Telugu Delhi Railway Station Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Stampede Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.