రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న వాహనాల తాకిడి.. ఇరుకైన రోడ్లు వెరసీ రోడ్డు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి.
తాజాగా రాజస్థాన్ (Rajasthan) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11మంది స్పాట్లోనే మరణించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవవారుజామున ప్యాసింజర్ పికప్ వ్యాన్ ట్రక్కును టీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు
పిల్లలు సహా 11మంది మరణించారని ధికారులు చెప్పారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలలీసులు ఘటనా స్థలానికి
చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
బాధితులంతా ఉత్తరప్రదేశ్కు(Uttarpradesh) చెందిన వారుగా తెలుస్తోంది. వీరంతా ఖాతు శ్యామ్, సాలాసర్ బాలాజీ ఆలయాలకు సందర్శించి తిరిగి వస్తుండగా మనో
హర్పూర్ హైవేపై తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని దౌసా పోలీసు సూపరింటెండెంట్ సాగర్ తెలిపారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్పి కప్ వాహనంలో 20మంది ప్రయాణిస్తున్నారని, హైవే సర్వీస్ లేన్లో ఆగి ఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టిందని అధికారులు చెప్పారు. గాయపడిన ముగ్గురు
వ్యక్తులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తొమ్మిది మందిని తదుపరి వైద్యసంరక్షణ కోసం సూచించామని చెప్పారు.
తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రాజస్థాన్ సిఎం కాగా ఈ ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి తగిన చికిత్స చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా సిఎం కోరారు. డ్రైవర్ నిద్రమత్తువల్ల ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వాహనం వేగంగా వచ్చి, లారీని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు చెబుతున్నారు.