భారతీయ రైల్వేస్ లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్ ట్రెయిన్ను విజయవంతంగా పరీక్షించారు. మధ్యప్రదేశ్లోని కజురహో-ఉత్తరప్రదేశ్లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు ట్రయల్రన్ నిర్వహించారు.
గత శుక్రవారం సాయంత్రం చైన్నై ఐసీఎఫ్ నుంచి కజురహో చేరిన వందేభారత్ స్లీపర్ రైలు.. శనివారం అక్కడి నుంచి మహోబాకు చేరుకున్నది. మరుసటి రోజు కజురహో నుంచి తిరిగి మహోబాకు వచ్చింది.
గంటకు 115 కిలోమీటర్ల వేగంతో..
ఎస్ఆర్డీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రయల్ రన్లో రైల్వే టెక్నికల్ టీమ్తోపాటు, ఐసీఎప్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా కజురహోకు వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు.. తిరుగు ప్రయాణంలో 130 కి.మీ. వేగంతో నడిచింది.

విమానం తరహాలో సౌకర్యాలు
వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. విమానం తరహాలో ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

రైలులో అత్యాధునిక సేవలు
ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దాంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనున్నది. రైలులో ఫైర్ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్ వద్ద అత్యవసర స్టాప్ బటన్స్ సైతం ఉంటాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్తో ఏర్పాటు చేశారు. అప్పర్ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ ను త్వరలో అమలులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రై చేస్తున్నది.
ప్రతి కోచ్లోనూ సీసీ కెమెరాలు ఉంటాయి. చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రతి బెర్త్ వద్ద సాకెట్ ఉంటుంది. అలాగే, బెర్త్ వద్ద చిన్న లైట్ సైతం ఉంటుంది. దాంతో ఎవరైనా బుక్లు, పేపర్ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది.
సేఫ్టీ ‘కవచ్’ సిస్టమ్, బ్లాట్ ప్రూఫ్ బ్యాటరీ, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది. అయితే, వందే భారత్ తొలి రైలు ట్రయల్ రన్ మధ్యప్రదేశ్లోని ఖజురహోలో జరుగనున్నది తెలుస్తున్నది.