త్వరలో వందే భారత్‌ తొలి స్లీపర్‌ రైలు!

Read Time:  1 min
vande bharath
vande bharath
FONT SIZE
GET APP

త్వరలో భారత్‌ తొలి స్లీపర్‌ రైలు రానున్నది. భారతీయులు ఎదురుచూస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ రైలు రానున్నాయి. భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. లోడెడ్‌ సిమ్యులేషన్‌ ట్రయల్స్‌ కోసం కోచ్‌లను ఐసీఎఫ్‌ చెన్నైకి పంపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ట్రయల్‌ తర్వాత రైళ్లు వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయన్నారు. భారతదేశపు తొలి స్లీపర్‌ వందే భారత్‌ రైలు త్వరలో ట్రయల్‌ రన్‌ మొదలవనున్నది. అయితే, ట్రయల్‌ రన్‌ పూర్తయ్యేందుకు దాదాపు రెండునెలల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం తొలి రైలు ఏ మార్గంలో నడుస్తుందనే చర్చ సాగుతున్నది.
రైల్వేబోర్డుకు భారీగా ప్రతిపాదనలు
దేశంలోని వివిధ రైల్వే జోన్ల నుంచి రైల్వేబోర్డుకు భారీగానే ప్రతిపాదనలు వచ్చినట్లు రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నుంచి ప్రారంభించేందుకు ఎక్కువగా అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వందే భారత్‌ స్లీపర్‌ రైలు చార్జీలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సమానంగా ఉంటాయని రైల్వేశాఖ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.