ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ప్రసారం చేసిన “మన్ కీ బాత్” కార్యక్రమంలో తన 117వ ఎపిసోడ్లో అక్కినేని నాగేశ్వరరావు, బాలీవుడ్ దిగ్గజాలు రాజ్ కపూర్ మరియు తపన్ సిన్హాను ప్రశంసించి, వారి విభిన్న కృషిని గుర్తించారు.
నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా, మోదీ ఆయనని ప్రశంసించి, ఆయన సినిమాలు భారతీయ సంప్రదాయాలు, విలువలను ప్రతిబింబిస్తాయని, తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన అపార కృషి భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందడానికి దోహదపడింది అన్నారు.
అదే ఎపిసోడ్లో, భారతీయ సినిమా రంగంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన రాజ్ కపూర్ మరియు తపన్ సిన్హాను కూడా మోదీ ప్రశంసించారు. ఈ మహానుభావులు తమ సినిమాల ద్వారా సామాజిక సమస్యలను సున్నితంగా పరిగణించి, అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అర్థం చేసుకునేలా తీర్చిదిద్దారు అని అన్నారు.

ప్రధాన మంత్రి, “భారతీయ సినిమా ఇప్పుడు ప్రపంచంలో ప్రశంశాలు పొందుతోంది” అని చెప్పారు. అలాగే, 2025లో భారతదేశంలో జరగబోయే ప్రపంచ ఆడియో-విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ సమ్మిట్ లో గ్లోబల్ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ రంగం ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.
“ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమంలో జాతీయ ఐక్యతను పెంపొందించడంలో భారతీయ చిత్ర పరిశ్రమ యొక్క పాత్రను కూడా మోదీ గుర్తించారు. ఈ లెజెండ్ల శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని, వారు చూపిన ప్రభావం భారతదేశం యొక్క సాంస్కృతిక, సామాజిక దృశ్యాన్ని మరింత సుదృఢం చేసిందని తెలిపారు.