Nara Lokesh: అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ

Read Time:  1 min
Nara Lokesh: అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ మంత్రి, నారా లోకేశ్ బుధవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశం దాదాపు 25 నిమిషాల పాటు సాగింది.ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న పథకాలు వంటి అంశాలపై లోకేశ్‌ (Nara Lokesh) చర్చించినట్లు తెలుస్తోంది. అధికారికంగా భేటీ వివరాలు వెలువడకపోయినా, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది సూక్ష్మంగా ప్రణాళికాబద్ధమైన సమావేశం కావచ్చని తెలుస్తోంది.

 Nara Lokesh: అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ
Nara Lokesh

మర్యాదపూర్వకంగా భేటీ

ఈ సమావేశం అనంతరం లోకేశ్‌ మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు స‌మాచారం. కేంద్ర మంత్రులు చిరాగ్ పాసవాన్, అర్జున్‌రామ్ మేఘ్వాల్‌ (Arjun Ram Meghwal) ను ఆయ‌న క‌ల‌వ‌నున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా లోకేశ్  ఈరోజు ఉదయం భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Also: DGP Harish Kumar : ఏపీ ప్రజలకు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా హెచ్చరిక

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.