हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఈ నెల 20 నుంచి మున్సిపల్ ఉద్యోగుల సమ్మె

Anusha
Andhra Pradesh: ఈ నెల 20 నుంచి మున్సిపల్ ఉద్యోగుల సమ్మె

ఏపిలోని మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మే 20వ తేదీ నుంచి ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ఇప్పటికే అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. మంగళవారం మున్సిపల్ శాఖ అదనపు డైరెక్టర్‌ మురళీకృష్ణ గౌడ్‌కు మున్సిపల్ కార్మికుల సంఘం ప్రతినిధులు సమ్మె నోటీసులు ఇచ్చారు. కనీస వేతనాన్ని రూ. 26 వేలకు పెంచడంతో పాటుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు డిమాండ్ చేశారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనంగా 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ శాఖలో కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తొలగిస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో మే 20 నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు.

ఉపసంహరణ

2024లోనూ ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. సమాన పనికి సమాన వేతనం సహా పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ అప్పట్లో సమ్మె బాట పట్టారు. అనంతరం ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో సమ్మె విరమించారు. కార్మికుల కొన్ని డిమాండ్లను పరిష్కరించేందుకు అప్పటి వైసీపీ సర్కారు అంగీకరించింది. రూ.15వేల జీతంతో పాటుగా హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు కలిపి 21 వేలు ఇచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం అంగీకరించింది.అలాగే జీతం పెంపుదల సమయంలో కనీస వేతనాన్ని 21 వేలుగా పరిగణిస్తామని హామీ ఇచ్చింది. ఇక సమ్మెకాలంలో జీతం, కేసుల ఉపసంహరణకు అప్పట్లో ప్రభుత్వం అంగీకరించింది. అలాగే మున్సిపల్ కార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోతే అందించే పరిహారం మొత్తాన్ని కూడా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు పెంచుతామని హామీ ఇస్తారు. దీంతో అప్పట్లో మున్సిపల్ కార్మికులు సమ్మెను విరమించుకున్నారు.

 Andhra Pradesh: ఈ నెల 20 నుంచి మున్సిపల్ ఉద్యోగుల సమ్మె

కార్మికుల

తాజాగా మరోసారి మున్సిపల్ కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో పాటుగా పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ కార్మికుల సంఘం నోటీసులు ఇచ్చింది. మరోవైపు మున్సిపల్ కార్మికులతో చర్చలు జరిపే ఆలోచనలో పురపాలక శాఖ అధికారులు ఉన్నారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also :Pawan Kalyan: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870