సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ప్రఖ్యాత దర్శకుడు SS రాజమౌళి తొలిసారిగా SSMB29 అనే తాత్కాలిక పేరుతో ఒక గొప్ప జాతీయ ప్రాజెక్ట్లో కలసి పనిచేయబోతున్నారు. భారీ అంచనాలతో ముందుకు సాగుతున్న ఈ చిత్రం, గ్లోబల్ జంగిల్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించి, SSMB29 రెండు భాగాలుగా విడుదల చేయాలని మరియు మొదటి భాగాన్ని 2027లో, రెండవ భాగాన్ని 2029లో విడుదల చేయాలని నిర్ణయించారు.
ఈరోజు, జనవరి 2, 2025, ఈ ప్రాజెక్ట్ను ప్రత్యేక పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభించారు. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా, మీడియాకి దూరంగా నిర్వహించబడింది.వివరాల ప్రకారం, ఈ చిత్రం థ్రిల్ మరియు గూఢచర్యం అంశాలను జంగిల్ అడ్వెంచర్ జానర్తో మిళితం చేస్తుంది. స్క్రిప్ట్ దాదాపు పూర్తయ్యిందని, ఏప్రిల్ 2025 నాటికి చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సినిమా కోసం కొంత భాగం కెన్యాలో, మరికొంత భారతదేశంలో షూటింగ్ చేయనున్నారు. ఈ భారీ సినిమా దుర్గా ఆర్ట్స్ పతాకంపై సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం మహేష్ పూర్తిగా మూడు సంవత్సరాలు కేటాయించనున్నారు. సాధారణంగా మహేష్ రెమ్యూనరేషన్ 250 కోట్లకు పైగా ఉంటుందని నిర్మాతలు అనుకుంటారు. కానీ, మహేష్ బాబు అందుకు భిన్నంగా రెమ్మూనరేషన్ తీసుకోవట్లేదని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరికీ లాభాల్లో చెరో 25 శాతం వాటా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించిన భారీ 1000 కోట్ల బడ్జెట్, భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.

మహేష్ బాబు హనుమంతుడి నుండి ప్రేరణ పొందిన పాత్రలో కనిపిస్తారని పుకార్లు ఉన్నాయి. ఇంకా, ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖులు కూడా భాగం కానున్నారని సమాచారం. అయితే, చివరి నటీనటుల ఎంపిక ఇంకా నిర్ధారణలో ఉంది. SSMB29 అనే ఈ ప్రాజెక్ట్, భారతీయ సినిమాకు ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందనే ఆశలు పెంచుతుంది. మహేష్ బాబు, రాజమౌళి కలయిక ఎంతటి అద్భుత ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.