మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

Donald Trump: మోడీ వస్తున్నారు వీధులను శుభ్రంగా వుంచండి: ట్రంప్‌ ఆదేశాలు

మోడీ అమెరికా పర్యటనకు వస్తున్నారని, ఆయనతో పాటు మరికొంతమంది దేశాధ్యక్షులు కూడా వస్తారని, వాళ్లు వచ్చిన సమయంలో వాషింగ్టన్‌ డీసీ సుందరంగా మారిపోవాలని, నగరంలో టెంట్లు, గోడలపై గ్రాఫిటీలు, రోడ్లపై గుంతలు కనిపించడానికి వీలు లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాషింగ్టన్‌ డీసీలో రోడ్డు పక్కల టెంట్లు, గోడలపై పిచ్చి పిచ్చి గ్రాఫిటీలు మోదీ తదితరులు చూడాలని నేను అనుకోవడం లేదంటూ ట్రంప్‌ పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీని శుభ్రం చేయాలని అనుకుంటున్నామని ట్రంప్‌ పేర్కొన్నారు.


రహిత నగరంగా వాషింగ్టన్‌ డీసీ
అలాగే నేర రహిత నగరంగా వాషింగ్టన్‌ డీసీని చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చే వారెవరూ తాము భద్రంగా ఉంటామనే భావనను కలిగి ఉండాలని, ఇక్కడ ఎలాంటి క్రైమ్‌లు జరగకుండా చూస్తామని అన్నారు. అందుకోసమే నగరాన్ని శుభ్రం చేస్తున్నాం. ఇప్పటికే టెంట్లు తొలగించాం. అలాగే గ్రాఫిటీలను కూడా తొలగిస్తాం. అందుకు మాకు పెద్దగా సమయం పట్టదు అంటూ ట్రంప్‌ వెల్లడించారు. కాగా, ప్రధాని మోదీ ఇటీవలె అమెరికాలో పర్యటించి, ప్రెసిడెంట్‌ ట్రంప్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పలు దేశాల అధినేతలో వైట్‌ హౌస్ లో వరుసగా సమావేశం అవుతున్నారు.
వాషింగ్టన్‌ డీసీని క్లీన్‌గా వుంచండి
ఇప్పటికే మోదీతో పాటు ఉక్రెయిన్‌, యూకే, జోర్దాన్‌ దేశాధ్యక్షులతో కూడా ట్రంప్ భేటీ అయ్యారు. ఇక మరోసారి ప్రధాని మోదీతో పాటు, యూకే ప్రధానితో కూడా ట్రంప్ భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే వారి రాక సమయంలో వాషింగ్టన్‌ డీసీ క్లీన్‌గా ఉండాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ఫిబ్రవరి 13న ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం ప్రధాని మోదీ వైట్‌హౌస్‌ను సందర్శించారు.

Related Posts
కార్యక్రమానికి జగన్ ను ఆహ్వానించిన పీఠాధిపతులు
కార్యక్రమానికి జగన్ ను ఆహ్వానించిన పీఠాధిపతులు

కార్యక్రమానికి జగన్ ను ఆహ్వానించిన పీఠాధిపతులు కర్ణాటక విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో Read more

మహారాష్ట్రలో పెరుగుతున్న GBS కేసులు
gbs cases

మహారాష్ట్రలో గిలియన్-బార్ సిండ్రోమ్ (GBS) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 183కు చేరుకుంది. ఈ వ్యాధి Read more

ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాం మారిందనే అపోహతో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో Read more

నేడు “విజయ్‌ దివస్‌”.. అమర జవాన్లకు నివాళులు
Today is "Vijay Divas".. tributes to the immortal jawans

న్యూఢిల్లీ: నేడు విజయ్‌ దివస్‌. దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. సరిగ్గా 53 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ Read more