విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌

అమరావతి: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారంటూ సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. సాక్షి పత్రికపై రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేసిన లోకేశ్ తరపు న్యాయవాదులు నేడు కోర్టులో వాదనలు వినిపించనున్నారు.

‘చినబాబు తిండికి 25 లక్షలండి’ పేరుతో 2019 అక్టోబర్ 22న సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో పేర్కొన్న అంశాలన్నీ పూర్తిగా అవాస్తవమని, తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనం రాశారంటూ కథనం ప్రచురితమైన మూడో రోజున అంటే 25న సాక్షి సంపాదక బృందానికి లోకేశ్ న్యాయవాదులు నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన సాక్షి అదే ఏడాది నవంబర్ 10న సమాధానం పంపింది.

దీనిపై సంతృప్తి చెందని లోకేశ్ ఆ సంస్థపై పరువునష్టం దావా వేశారు. విశాఖ విమానాశ్రయంలో తాను చిరుతిళ్లు తిన్నట్టు వార్తలో పేర్కొన్న తేదీల్లో తాను ఇతర ప్రాంతాల్లో ఉన్నానని, అయినప్పటికీ దురుద్దేశంతో తన పరువుకు భంగం కలిగించేలా రాజకీయ లబ్ధికోసం అసత్యాలతో కథనం ప్రచురించారని లోకేశ్ తన దావాలో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, సాక్షి ప్రచురణ కర్త మురళి, విశాఖ సాక్షి న్యూస్ రిపోర్టర్లు వెంకటరెడ్డి, ఉమాకాంత్‌లపై రూ. 75 కోట్లకు పరువునష్టం దాఖలు చేశారు.

Related Posts
రైతు సంఘాలతో భేటీకి రాష్ట్రపతి నిరాకరణ
President's refusal to meet with farmers' association

చండీగఢ్‌ : సమయాభావం కారణాన్ని చూపుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం) ప్రతినిధులతో సమావేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిరాకరించారు. పంటలకు గిట్టుబాటు ధరలు, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, Read more

నేడు మిర్చి యార్డ్, ట్రేడర్లతో సీఎం భేటీ
CM Chandrababu meet with Mirchi yard and traders today

మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంఅమరావతి: మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక, పాలక, ప్రతిపక్ష నేతల ఎంట్రీతో.. మిర్చి ధరలకు రాజకీయరంగు Read more

నిక్కర్ మంత్రి అంటూ లోకేష్ పై వైసీపీ సెటైర్లు..
lokesh delhi

త్వరలోనే రెడ్ బుక్ మూడో ఛాప్టర్ తెరుస్తానని మంత్రి నారా లోకేష్ చేసిన హెచ్చరికలపై వైసీపీ Xలో సెటైర్లు వేసింది. 'మూడో ఛాప్టర్ కాదు నిక్కర్ మంత్రి.. Read more

మరో కార్యక్రమాన్ని రద్దు చేసిన కూటమి సర్కార్

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని రద్దు చేసింది. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని ఇకపై కొనసాగించబోమని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *