మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా లో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రి కుమార్తెపై కొందరు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ప్రదర్శన నిర్వహించారు. నిందితులపై పోక్సో చట్టం, లైంగిక వేధింపుల చట్టాలు, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.జల్గావ్ జిల్లాలోని ముక్తాయ్ నగర్ ప్రాంతంలో సంత్ ముక్తాయ్ యాత్ర సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంత్ ముక్తాయ్ యాత్ర జరుగుతుంది. జరిగిన ఈ యాత్రలో కేంద్ర మంత్రి కుమార్తెతో పాటు మరికొందరు బాలికలు హాజరయ్యారు. అయితే, అదే సమయంలో కొంతమంది యువకులు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు, వారిని ఆటపట్టించేందుకు ప్రయత్నించారు.
సెక్యూరిటీ గార్డు జోక్యం
బాలికల పట్ల అశ్లీలంగా ప్రవర్తిస్తూ, వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తున్న దుండగులను సెక్యూరిటీ గార్డు ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే, నిందితులు అతడిపై కూడా దాడికి దిగారు. ఈ సంఘటనతో, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత విషయం ముక్తాయ్ నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది.
పోలీస్ స్టేషన్
ఈ ఘటనపై కేంద్ర మంత్రి తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. నేరుగా ముక్తాయ్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి, తాను మంత్రిగా కాకుండా తండ్రిగా వచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘నా కూతురు సురక్షితంగా లేకపోతే, సామాన్యుల కూతుళ్ల పరిస్థితి ఏంటి?’’ అంటూ ప్రశ్నించారు.
కేసు నమోదు
ఫిర్యాదు తర్వాత, ముక్తాయ్నగర్ పోలీసులు నిందితులైన యువకులపై కేసు నమోదు చేశారు. ఒక నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన ముక్తాయ్ నగర్, జల్గావ్ లలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి కార్యకర్తలు, స్థానికులు పోలీస్ స్టేషన్ వెలుపల ప్రదర్శన నిర్వహించారు. అదే సమయంలో, రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చనీయాంశంగాఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల చర్యలు, మహిళల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేసును త్వరగా పరిష్కరించాలని బీజేపీ నేతలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.