Lok Sabha: అఖిలపక్ష భేటీతో ఆందోళనలకు బ్రేక్‌

Read Time:  1 min
Lok Sabha: అఖిలపక్ష భేటీతో ఆందోళనలకు బ్రేక్‌
FONT SIZE
GET APP

బీహార్ ఓటరు జాబితా సవరణ, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి వివాదాస్పద అంశాలపై పార్లమెంట్‌లో తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షం (the opposition)అయిన ఇండియా కూటమి ఎంపీలు వాయిదా తీర్మానాలపై చర్చించాలంటూ ఆందోళనలు చేపడుతూ, గడిచిన నాలుగు రోజులుగా సభ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడటం నెలకొన్న పరిస్థితి. ఈ నేపధ్యంలో, లోక్‌సభ (Lok Sabha) స్పీకర్ ఓంబిర్లా ప్రతిపక్షాల మధ్య సమన్వయం కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతలకు ప్రశ్నోత్తరాల సమయంలో అర్థవంతమైన చర్చలు జరగాలని, సభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరారు.

 Lok Sabha:   అఖిలపక్ష భేటీతో ఆందోళనలకు బ్రేక్‌
Lok Sabha: అఖిలపక్ష భేటీతో ఆందోళనలకు బ్రేక్‌

ఉభయసభలు ప్రారంభమైన నిమిషాల్లోనే వాయిదా పడుతున్నాయి. దీంతో సభలో నిరసనలకు బ్రేక్‌ వేసేందుకు లోక్‌సభ (Lok Sabha) స్పీకర్‌ ఓంబిర్లా ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సహకరించాలని ప్రతిపక్ష నాయకులను స్పీకర్‌ కోరినట్లు తెలిసింది. దీంతో సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష ఎంపీలు చెప్పినట్లు సమాచారం. దీంతో సోమవారం నుంచి లోక్‌సభ కార్యకలాపాలూ సజావుగా సాగనున్నాయని సమాచారం. పహల్గాం ఉగ్రదాడి నేప‌థ్యంలో.. భార‌తీయ సైనిక ద‌ళాలు .. పాకిస్థాన్‌పై ఆప‌రేష‌న్ సింధూర్చే పట్టిన విష‌యం తెలిసిందే. పాక్‌లో ఉన్న 9 ఉగ్రస్థావ‌రాల‌ను ఆ ఆప‌రేష‌న్ స‌మ‌యంలో నేల‌మ‌ట్టం చేశారు. అయితే పార్లమెంట్‌లో ఆ అంశంపై చ‌ర్చించేందుకు కేంద్రం డేట్‌ ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. జూలై 28వ తేదీన దీనిపై చ‌ర్చ చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందు కోసం లోక్‌స‌భ‌ (Lok Sabha), రాజ్యసభలో 16 గంట‌ల పాటు చ‌ర్చించేందుకు స‌మ‌యాన్ని కేటాయించింది.

లోక్ సభ సభ్యులు ఎవరు?

లోక్‌సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఆధారంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రజల ప్రతినిధులతో కూడి ఉంటుంది. భారత రాజ్యాంగం సభలో గరిష్టంగా 550 మంది సభ్యులను అనుమతిస్తుంది, 530 మంది సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు మరియు 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.

మొదటి లోక్ సభ స్పీకర్ ఎవరు?

శ్రీ జివి మావలంకర్ లోక్ సభ మొదటి స్పీకర్ (15 మే 1952- 27 ఫిబ్రవరి 1956). లోక్ సభ మొదటి డిప్యూటీ స్పీకర్ శ్రీ ఎం. అనంతశయనం అయ్యంగార్ లోక్ సభ మొదటి డిప్యూటీ స్పీకర్ (30 మే 1952-7 మార్చి 1956).

లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన తొలి మహిళ ఎవరు?

మీరా కుమార్ (జననం 31 మార్చి 1945) ఒక భారతీయ రాజకీయవేత్త మరియు మాజీ దౌత్యవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు, ఆమె 2004 నుండి 2009 వరకు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిగా , 2009లో కొంతకాలం జలవనరుల మంత్రిగా పనిచేశారు. ఆమె 2009 నుండి 2014 వరకు లోక్‌సభకు 15వ స్పీకర్‌గా పనిచేశారు, ఈ పదవిని నిర్వహించిన మొదటి మహిళ.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Breaking news: తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.