Mallikarjun Kharge: బిసి రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నిక నిర్వహించాలి— మల్లికార్జునఖర్గేతో బిసి సంఘాల భేటీ

Read Time:  1 min
Mallikarjun Kharge: బిసి రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నిక నిర్వహించాలి--- మల్లికార్జునఖర్గేతో బిసి సంఘాల భేటీ
Mallikarjun Kharge: బిసి రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నిక నిర్వహించాలి--- మల్లికార్జునఖర్గేతో బిసి సంఘాల భేటీ
FONT SIZE
GET APP

హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ఐఎసిసి అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే తెలిపారు. బీసీ సంఘాల నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎఐసిసి చీఫ్ ఖర్గే సమావేశమైనారు. ఈ సంద ర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం బిసి రిజర్వేషన్లు 42 పెంచుతూ కేంద్రానికి పంపించిన బిల్లును చట్ట రూపంలో దాల్చడానికి జాతీయస్థాయిలో కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు
నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ విజప్తి చేశారు.

బిసిలకు ఉపముఖ్యమంత్రి తో పాటు మరో ఇద్దరు

అఖిలపక్షాన్ని కేంద్రంకు తీసుకొని వెళ్ళేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంలో జనాభా ప్రకారం నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ కీలక పదవులలో, బిసిలకు జనాభా ప్రకారం కేటాయించాలన్నారు బిసిలకు ఉపముఖ్యమంత్రి తో పాటు మరో ఇద్దరు బిసిలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా కులగనన కేంద్ర ప్రభుత్వం నిర్వ హించిన తర్వాత జనాభా దామస్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు (BC reservations) పెంచాలని, దేశంలోని సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని, మహిళా బిల్లులో బిసి మహిళలకు సపోర్టు కల్పించాలని, బీసీలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా యుపిఎ పార్టీల పక్షాన పోరాడాలని మల్లికార్జున ఖర్గేను జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.

Mallikarjun Kharge: బిసి రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నిక నిర్వహించాలి--- మల్లికార్జునఖర్గేతో బిసి సంఘాల భేటీ
Mallikarjun Kharge: బిసి రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నిక నిర్వహించాలి— మల్లికార్జునఖర్గేతో బిసి సంఘాల భేటీ

తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బిసి కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, మాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, ప్రొఫెసర్ బాగయ్యా (Professor Bagayya), కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్ గౌడ్, కనకాల శ్యాంకుర్మా, గొడుగు మహేష్ యాదవ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, నరేష్ ప్రజాపతి, జాజుల లింగ గౌడ్, సంధ్య, సమతా యాదవ్, గూడూరు భాస్కర్, గంగిరెద్దుల నరసింహ, పాను గంటి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Kishan Reddy: ఖనిజాల ఉత్పత్తిలో అత్యాధునిక సాంకేతికత– కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్ రెడ్డి

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.