ACB notices to KTR once again..!

నేడు ఢిల్లీకి వెళ్లనున్న కేటీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు దేశరాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. లగచర్ల దారుణాలను జాతీయ మీడియా ముందు చూపించనున్న కేటీఆర్.. కొడంగల్ లగచర్ల బాధితుల కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితతో కలిసి కేటిఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫార్మా విలేజ్ పేరుతో రేవంత్ సర్కార్ బలవంతపు భూసేకరణ చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేయనుంది.

గిరిజనులు, దళితులు, ఓబీలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందంటోన్న కేటీఆర్‌… ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ లో ప్రెస్‌మీట్‌ కూడా పెట్టనున్నారు. ఇక అటు నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ సందర్భంగా గిరిజనులపై దాడిన దాడి వివరాలను తెలుసుకోనుంది జాతీయ ఎస్టీ కమిషన్. లగచర్ల నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్లి రైతులతో ముఖాముఖిలో కూడా పాల్గొననుంది జాతీయ ఎస్టీ కమిషన్..

ఇకపోతే..తెలంగాణలో గిరిజన బిడ్డలపై జరిగిన, జరుగుతున్న దాష్టీకంపై జాతీయ మీడియా కూడా స్పందించాలని లగచర్ల బాధితులు వేడుకుంటున్నారు. పథకం ప్రకారం కరెంటు తీసి, అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి, ఆడబిడ్డలను అసభ్యంగా తాకుతూ, పడుకున్నవారిని కూడా అట్లాగే పోలీస్‌ స్టేషన్లకు తరలించిన తీరుపై ప్రత్యేక కథనాలు రాయాలని కోరుతున్నారు. ‘కొండగల్‌లో జరిగిన అరాచకాలను, ఆగడాలను వెలికితీయాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారులపై తిరగబడిన కాంగ్రెస్‌, బీజేపీ సానుభూతి పరులైన కొందరు రైతులను తప్పించి, ఆ ఘటనతో సంబంధం లేని రైతులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన ఉదంతాలను, తమ పోరాటాన్ని జాతీయస్థాయిలో వెలుగులోకి తేవాలని ప్రాధేయపడుతున్నారు. ‘ఏ ఇంట్ల చూసినా ఆర్తనాదాలే విపిస్తున్నయి. వాటిని ఢిల్లీ స్థాయిల చూపించండి సారూ.. మీ బాంచెన్‌’ అంటూ జ్యోతి అనే నిండు చూలాలు చేతులెత్తి ఢిల్లీకి వెళ్లి జాతీయ మీడియాను వేడుకుంటున్నది.

Related Posts
91 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు – కూటమి ప్రభుత్వం
deepam schem

"దీపం-2" పథకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పేద కుటుంబాల గృహిణులకు గ్యాస్ కనెక్షన్లను అందించే ప్రభుత్వ పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా Read more

ప్రియాంకా చోప్రానే నాకు రోల్ మోడల్ అంటున్న సమంత
sam priyanka

నటి సమంత రూత్ ప్రభు, ప్రియాంకా చోప్రాను తన రోల్ మోడల్‌గా భావిస్తున్నట్టు ప్రకటించారు. 'బిజినెస్ టుడే' నిర్వహించిన 'మోస్ట్ పవర్ఫుల్ వుమెన్' కార్యక్రమంలో మాట్లాడిన సమంత, Read more

అలాంటి అపోహలే పెట్టుకోవద్దు – సీఎం రేవంత్
VLF Radar Station in Telang

వికారాబాద్ దామగుండం ఫారెస్టులో ప్రారంభించబోయే 'వీఎల్ఎఫ్' రాడార్ స్టేషన్ ప్రాజెక్టుపై అపోహలొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు మరింత గౌరవం తీసుకొస్తుందని , Read more

అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్
sridarbabu

సంధ్య థియేటర్ ఘటనపై సినీ హీరో అల్లు అర్జున్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి తన వైఖరిని స్పష్టంచేశారు. అనుమతులు ఉన్నందునే తాను థియేటర్ వద్దకు వెళ్లానని, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *