గుజరాత్లో మరో వంతెన కుప్పకూలిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన బీజేపీ ప్రచారం చేసుకునే ‘డబుల్ ఇంజిన్ గుజరాత్ మోడల్’కు మరో ఉదాహరణ అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన ఘాటు విమర్శలు చేశారు.
కేటీఆర్ విమర్శలు: డబుల్ ఇంజిన్ సర్కార్ల వైఫల్యం
గతంలో మోర్బీ వంతెన కూలి 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనను కేటీఆర్ (KTR) గుర్తుచేస్తూ, తాజాగా జరిగిన ఈ సంఘటన మరోసారి షాక్కు గురిచేసిందని అన్నారు. “డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్న గుజరాత్, బీహార్లలోనే తరచూ వంతెనలు ఎందుకు కూలుతున్నాయి? ఈ ఘటనపై ఎన్డీఎస్ఏ (NDSA) లేదా ఇతర స్వతంత్ర సంస్థలతో సమగ్ర విచారణ జరిపిస్తారని ఆశిస్తున్నా. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని కేటీఆర్ తన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇది డబుల్ ఇంజిన్ (Double engine) ప్రభుత్వాల పాలనలో జరుగుతున్న నాణ్యతా లోపాలకు, నిర్మాణ లోపాలకు నిదర్శనమని ఆయన పరోక్షంగా ఆరోపించారు.
పద్రా సమీపంలో ‘గంభీర’ వంతెన కూలింది
ఈ దుర్ఘటన గుజరాత్లోని పద్రా సమీపంలో చోటు చేసుకుంది. మహిసాగర్ నదిపై (Mahisagar River) నిర్మించిన ‘గంభీర’ వంతెన బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ భయంకరమైన ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై నాలుగు వాహనాలు ప్రయాణిస్తున్నాయి. అవి ఒక్కసారిగా నదిలోకి పడిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, స్థానిక పోలీసులు అత్యంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి, నదిలో పడిపోయిన పలువురిని సురక్షితంగా కాపాడగలిగారు. అయితే, ఇంకా నదిలో గల్లంతైన మరికొందరి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) వంటి సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను కలిగించింది. వరుసగా వంతెనలు కూలుతున్న ఘటనలు ప్రభుత్వ నిర్మాణ నాణ్యత ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
కేటీఆర్ అర్హతలు?
కేటీఆర్ (కల్వకుంట్ల తారకరామారావు) ఇంజినీరింగ్లో బీసీఇ పూర్తిచేసి, యు.ఎస్లో ఎంబిఎ (MBA) చదివారు.
అభ్యాసంతో పాటు రాజకీయాల్లోనూ ప్రావీణ్యం సంపాదించి తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు.
కేటీఆర్ ఫుల్ ఫారం?
కేటీఆర్ పూర్తి పేరు కల్వకుంట్లా తారక రామారావు
Read hindi news: hindi.vaartha.com
Read also: Bandh: తెలుగు రాష్ట్రాల్లో అంతగా కనిపించని బంద్ ప్రభావం