KTR key comments on the new IT Act

కొత్త ఐటీ చట్టంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టంపైకీలక వ్యాఖ్యలు చేశారు. ఇది దేశ పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ చట్టం ద్వారా కేంద్రానికి అపరిమిత అధికారులు కట్టబెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును అన్ని పార్టీలు వ్యతిరేకించాలని ఆయన సూచించారు. కేంద్రం ప్రతిపాదిత ఆదాయపు పన్ను బిల్లు 2025పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును పౌరుల డిజిటల్ గోప్యత ముప్పుగా అభివర్ణించిన కేటీఆర్‌…ఇందులో నిబంధనలు ఖండించారు.

Advertisements
కొత్త ఐటీ చట్టంపై కేటీఆర్

కొత్త ఆదాయపు పన్ను బిల్లు

పన్ను అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం పరిధికి మించి అధికారాలను వినియోగించుకోవడానికి చూస్తోందని ఆరోపించారు. అందుకు ఈ బిల్లు సహకరించేలా ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త ఐటీ చట్టం పౌరుల డిజిటల్ గోప్యతకు తీవ్ర ముప్పు కలిగిస్తుంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఐటీ అధికారులకు సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ఖాతాల తనిఖీ పేరుతో అపరిమిత అధికారాలను ఇచ్చేలా ఉంది అని కేటీఆర్ అన్నారు. ఇందులో ప్రస్తావించిన వర్చువల్ డిజిటల్ స్పైసెస్ వేధింపులకు, దుర్వినియోగానికి, విస్తృత నిఘాకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది పూర్తిగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం

ఇప్పటికే దేశ పౌరుల ఆర్థిక డేటా అనేక సంస్థల ఆధీనంలో ఉందని, ఇప్పుడు తీసుకొచ్చే చట్టం పౌరుల ప్రాథమిక హక్కులు, డిజిటల్ గోప్యతను తొక్కేస్తుందన్నారు. ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకుని అధికారులెవరైనా రూల్స్ దుర్వినియోగం చేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. దీనికి ప్రధాని, ఆర్థికమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పౌరులకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా వ్యవహరించే ప్రమాదం ఉందని, ఇది పూర్తిగా రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు కేటీఆర్. ఐటీ వ్యవస్థకు ప్రస్తుత నిఘా వ్యవస్థలు సరిపోతాయని కేటీఆర్ అన్నారు.

Related Posts
Barath Gourav: 21 నుంచి కాజిపేట జంక్షన్ నుండి భారత్ గౌరవ్ స్పెషల్ ట్రైన్
Barath Gourav: కాజీపేట నుండి భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు – ప్రయాణికులకు గుడ్ న్యూస్

భక్తులకు విశేష అవకాశం కల్పించింది దక్షిణ మధ్య రైల్వే. దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు భక్తులకు ఒక ప్రత్యేక యాత్రను ప్రకటించింది. భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ Read more

ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం : బైక్ ర్యాలీని నిర్వహించిన అపోలో క్యాన్సర్ సెంటర్
Prostate Cancer Awareness P

హైదరాబాద్ : అపోలో క్యాన్సర్ సెంటర్ (ACC) హైదరాబాద్, ది బైకెర్నీ క్లబ్‌తో కలిసి, ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పురుషుల క్యాన్సర్ మాసం సందర్భంగా Read more

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ప‌లు చోట్ల దారి మళ్లింపు
Traffic restrictions in the city tomorrow.. diversions at many places

హైదరాబాద్‌: మార్చి 8వ తేదీన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ జాయింట్ క‌మిష‌న‌ర్ జోయ‌ల్ డేవిస్ Read more

నేడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు
ఆప్ వెనుకంజకి ప్రధాన కారణాలు ఏంటి?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరియు భారతీయ జనతా Read more

Advertisements
×