हिन्दी | Epaper

KL Rahul: తొలి టెస్ట్ మ్యాచ్‌ లో ఖచ్చితంగా గెలుస్తాం :రాహుల్‌

Anusha
KL Rahul: తొలి టెస్ట్ మ్యాచ్‌ లో ఖచ్చితంగా గెలుస్తాం :రాహుల్‌

ఇంగ్లండ్‌ జట్టుతో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మీడియాతో మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో చివరకు ఖచ్చితంగా ఫలితం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత బౌలర్లు అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందిస్తారని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. ఈ మ్యాచ్‌ అభిమానులకు గొప్ప వినోదాన్ని పంచుతుందని, చివరి రోజు ఆట ఉత్కంఠభరితంగా సాగుతుందని అన్నాడు.ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం ఖాయమని రాహుల్ జోస్యం చెప్పాడు. “ఈ టెస్టు మ్యాచ్‌కి ఒక బ్లాక్‌బస్టర్ ముగింపు ఉంటుంది. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు (England players) కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మా బౌలర్లు చివరి రోజు పది వికెట్లు పడగొట్టి టీమిండియాకు సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందిస్తారని నమ్ముతున్నాను” అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

భారీ స్కోరు 

భారత రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన 137 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా రిషభ్ పంత్ (115)తో కలిసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి ప్రదర్శనతో టీమిండియా (Team India), ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.అలాగే గత కొంతకాలంగా జట్టులో తన బ్యాటింగ్ స్థానంపై ఉన్న సందిగ్ధత తొలగిపోయిందన్నాడు. విభిన్న బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉందని రాహుల్ పేర్కొన్నాడు. “గత రెండు సంవత్సరాలుగా బ్యాటింగ్ ఆర్డర్‌లో నా స్థానం ఏంటి? నాకు ఏది సౌకర్యంగా ఉంటుందో? అన్న విషయం నేను దాదాపు మర్చిపోయాను.

KL Rahul: తొలి టెస్ట్ మ్యాచ్‌ లో ఖచ్చితంగా గెలుస్తాం :రాహుల్‌
KL Rahul

నన్ను నేను సవాలు చేసుకోవడానికి

ఇప్పుడు నాకు వివిధ బాధ్యతలు, పాత్రలు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇది నాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. నన్ను నేను సవాలు చేసుకోవడానికి, మరింత రాటుదేలడానికి ఇది దోహదపడింది. ఈ ప్రయాణాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను” అని కేఎల్ రాహుల్ తెలిపాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే, 371 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ (Wicket) నష్టపోకుండా 21 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 350 పరుగులు చేయాల్సి ఉంది. భార‌త్ గెల‌వాలంటే ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టాలి. దీంతో చివరి రోజు ఆటపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also: Sunil Gavaskar: సిరాజ్‌పై గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు..

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి పై తీవ్రంగా ఖండించిన భారత్

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు
0:32

నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!..పంచ్ ఆనంద కేరింతలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

ఆఫ్ఘన్ దాడులపై ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌పై భారత్ విమర్శలు

హార్ముజ్ జలసంధిపై చైనా సంచలన ప్రక్రియ.. ట్రంప్ ప్రతిపాదనకు షాక్!

హార్ముజ్ జలసంధిపై చైనా సంచలన ప్రక్రియ.. ట్రంప్ ప్రతిపాదనకు షాక్!

టెహ్రాన్, లెబనాన్‌లపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ .. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు!

టెహ్రాన్, లెబనాన్‌లపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ .. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, ఈషా అంబానీ రాయల్ ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870