Arguments on Kakani anticipatory bail petition concluded... verdict reserved

AP HighCourt : కాకాణి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్‌

AP HighCourt: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్లు కాకాణి తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. అయితే, అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలువురిని బెదిరించారని పోలీసుల తరఫు న్యాయవాది వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Advertisements
కాకాణి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

ప్రస్తుతం పరారీలోనే గోవర్ధన్‌రెడ్డి

వైసీపీ ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్జ్‌ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్‌ అధికారి బాలాజీ నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా కేసులో జోడించారు. ప్రస్తుతం గోవర్ధన్‌రెడ్డి పరారీలోనే ఉన్నారు. అతడి ఆచూకీ కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు.

కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు.

కాగా, అక్రమ మైనింగ్ కేసులో వరుసగా రెండు సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (ఏప్రిల్ 1) కొట్టివేసింది.

Read Also: అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీ : సీఎం చంద్రబాబు

Related Posts
రష్యా మిసైల్ దాడి: ఉక్రెయిన్ వినిట్సియా ప్రాంతంలో 8 ఇళ్లు ధ్వంసం
russia attack

రష్యా చేసిన మిసైల్ దాడి ఉక్రెయిన్ యొక్క వినిట్సియా ప్రాంతంలో భారీ నష్టాన్ని కలిగించింది. ఈ దాడిలో 8 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. అలాగే ఒక మహిళ Read more

నేడు “విజయ్‌ దివస్‌”.. అమర జవాన్లకు నివాళులు
Today is "Vijay Divas".. tributes to the immortal jawans

న్యూఢిల్లీ: నేడు విజయ్‌ దివస్‌. దేశ చరిత్రలో మర్చిపోలేని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. సరిగ్గా 53 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌ Read more

చంద్రబాబు తెలంగాణకు రావాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్యే అనిరుధ్
mla anirudh

తిరుమలలో తెలంగాణ MLAల రికమండేషన్ లెటర్ల చెల్లవనడంపై జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యంలో నెట్టాయి. ఆయన, తమ లెటర్లు చెల్లకపోతే చంద్రబాబు Read more

Chandrababu: రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

శ్రీరాముని జన్మదినమైన శ్రీరామనవమి పర్వదినం, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఆధ్యాత్మికంగా, ఉత్సాహంగా, జరుపుకుంటారు. ప్రతి నగరం, పట్టణం, గ్రామం సైతం రామనామ స్మరణలతో మార్మోగుతూ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×