విజయవాడ : తెలుగురాష్ట్రాల్లో వివాదంగా మారిన
బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టును స్థాపించేందుకు పునాది వేస్తూ.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా ‘జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్చి’ (Jala harati Corporation Limited) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. అమరావతిని జలవనరుల కేంద్రంగా తీర్చిదిద్దడం.. ఈ కొత్త జలహారతి కార్పొరేషన్” (Jala harati Corporation Limited) ద్వారా అమరావతి, గవర్నర్ పేట ప్రాంతంలో ఉన్న జలవనరుల శాఖ కార్యాలయం ఆధారంగా నడపబడుతుంది. ఇది పోలవరం ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వర్తించగల సామర్థ్యాన్ని అందిస్తోంది.
జలవనరుల వినియోగానికి జలహారతి
అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఈ జలహారతి కార్పొరేషన్ ఎస్పీవీ స్థాపన.. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని సమర్థంగా వినియోగించేందుకు పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖచే ‘జలహారతి కార్పొరేషన్’ అనే వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ సంస్థని స్థాపించింది. ఈ సంస్థను పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయవచ్చని స్పష్టంగా అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సంస్థకు ముఖ్యమంత్రి చైర్మన్, జలవనరుల మంత్రి వైస్ చైర్మన్, ముఖ్య కార్యదర్శి బాధ్యతలు చేపట్టనున్నారు.
టోనీ బ్లెయిర్ ఫౌండేషన్తో ఏపీ భాగస్వామ్యం
రాష్ట్రంలో ఐదు క్లస్టర్లతో నైపుణ్యాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనలో (Tony Blair Foundation) తో కలిసి ఏపీ పనిచేస్తోందన్నారు. ఐటీఐ (ITI), పాలిటెక్నిక్లలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లో 1,164 ఉద్యోగ మేళాలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 61,991 మందికి ఉద్యోగాలు లభించినట్లు లోకేష్ (Lokesh) వివరించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారిలో 74,834 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. నైపుణ్య పోర్టల్లో రిజిస్ట్రేషన్లు, శిక్షణ, సర్టిఫికేషన్, ఉపాధి కల్పనతో పాటు పరిశ్రమలో అనుసంధానం, విదేశీ భాషల్లో శిక్షణ వరకు వివరాలు పొందుపరుస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Read also: Pawan Kalyan : నేడు రాజమండ్రికి పవన్ కళ్యాణ్