📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

X – Account: ఇమ్రాన్ ఖాన్,బిలావల్ ఎక్స్ ఖాతా బ్లాక్ చేసిన భారత్

Author Icon By Anusha
Updated: May 4, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సింధు జలాల ఒప్పందం రద్దుతో అసహనంతో ఇండియాపై విషం కక్కుతున్న వారిపైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. దాయాది దేశంలోని రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, నటులు ఇలా అందరికీ వరసపెట్టి షాకులిస్తోంది.పాకిస్తానీ పౌరులు, పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లు, అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆంక్షలు విధించింది.పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ‘ఎక్స్’ ఖాతాలను భారతదేశంలో బ్లాక్ చేశారు.యితే, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. రెచ్చగొట్టేలా ఇష్టారీతిన మాట్లాడిన పాకిస్తాన్ సమాచార, ప్రసార శాఖా మంత్రి అతుల్లా తరార్ ‘ఎక్స్ ‘ ఖాతాను కూడా నిషేధించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ రానున్న 24 నుంచి 36 గంటల్లోగా తమ దేశంపై సైనిక దాడికి దిగుతుందని ఇస్లామాబాద్‌కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందని రెండు రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

నిరంతరం

అంతకు ముందే, భారతదేశంలో అనేక మంది పాకిస్తానీ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో హనియా అమీర్, మహీరా ఖాన్ సహా అనేక మంది పాకిస్తానీ నటుల ఖాతాలు కూడా ఉన్నాయి. పాకిస్తానీయులు నిరంతరం చేస్తున్న ప్రకటనల కారణంగా భారత ప్రభుత్వం ఈ చర్య పూనుకుంటోంది.పాకిస్తాన్‌కు చెందిన దాదాపు 16 యూట్యూబ్ ఛానెల్‌లను భారతదేశం నిషేధించింది.హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు తర్వాత ఈ చర్య తీసుకోవడం జరిగింది. దేశంలో సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేసిన ఆటగాళ్లలో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, షోయబ్ మాలిక్, షోయబ్ అక్తర్ సహా అనేక మంది ఉన్నారు.

నిషేధించిన

అంతకుముందు, ఉగ్రదాడి తర్వాత, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, బాసిత్ అలీ, షోయబ్ అక్తర్ ల యూట్యూబ్ ఛానెల్‌లను కూడా భారతదేశంలో నిషేధించారు. పాకిస్తాన్ నుండి నిషేధించిన ఇతర యూట్యూబ్ ఛానెల్‌ల జాబితాలో డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్ వై న్యూస్, బోల్ న్యూస్, జియో న్యూస్ వంటి ప్రముఖ పేర్లు ఉన్నాయి. గత నెల 22న మధ్యాహ్నం జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్‌గామ్‌ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చర్యలకు దిగింది. వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్‌ నటుల సినిమాలు బ్యాన్‌ చేసింది. పాక్‌ విమానాలకు భారత గగనతలం మూసివేసింది.

Read Also: President: సింగపూర్ ప్రధాని తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా: మోడీ

#BilawalBhuttoBlocked #ImranKhanBlocked #IndiaTakesAction #PahalgamAttack #PakistanBan #SocialMediaBan Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.