📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Tariffs: ఇక పై ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేసే వారిపై సుంకం?

Author Icon By Anusha
Updated: May 4, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి షాక్ కలిగిస్తున్నాయి. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ.సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నారు. ఇప్పటికే ప్రతీకార సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న ట్రంప్ఇప్పుడు మరో సరికొత్త నిర్ణయం తీసుకుని భారతీయులకు అందులో తెలుగు వారికి భారీ షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు. కాదేదీ సుంకానికి అనర్హం అన్నట్లు ప్రవర్తిస్తున్న ట్రంప్ తాజాగా తెలుగు వారి జిహ్వ చాపల్యాన్ని తీర్చే పచ్చళ్లపై కన్ను వేశాడు. ఇకపై పచ్చళ్లపై కూడా పన్ను చెల్లించాలట.

వివరాలు

అమెరికాలో ఉన్న మన వాళ్లు ఇండియా నుంచి ఎవరైనా స్నేహితులో, బంధువులో అక్కడకు వస్తుంటే ఫలానా వస్తువులు, తినుబండారాలు, పచ్చళ్లు, పొడులు, బట్టలు, ఇతరాత్ర వస్తువలు వంటివి తీసుకురావాల్సిందిగా కోరుతుంటారు. అయితే ఇలా వ్యక్తిగత స్థాయిలో తెప్పించుకునే ఉత్పత్తుల మీద ఇప్పటి వరకు అమెరికా ప్రభుత్వం పన్నులు వసూలు చేయలేదు. కానీ ఇప్పుడు అక్కడ అధికారంలో ఉంది ట్రంప్ కదా దాంతో ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలపై కూడా అమెరికా ప్రభుత్వం తాజాగా దృష్టి సారిస్తోంది.వ్యక్తిగతంగా వ్యక్తుల ద్వారా, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా తెప్పించుకునే ఉత్పత్తుల మీద ఇక నుంచి అమెరికా అధికారులు నిఘా పెట్టనున్నారు. అలానే ఇలా తెప్పించుకునే వాటి మీద పన్ను వసూలు చేసి ఖజానా నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అమెరికా అధికారులు. సుంకం చెల్లించకపోతే, భారీ జరిమానాలు విధించి ఇలాంటి మార్గాలను పూర్తిగా కట్టడి చేయాలని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

సుంకాలు

భారత్‌లో మాదిరిగానే అమెరికాలో కూడా సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌నే వ్యాపార వేదికలుగా మార్చుకుని అనేకమంది బిజినెస్ చేస్తున్నారు. వీరిలో పలువురు తెలుగువాళ్లు, ఇతర రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఇండియా నుంచి వివిధ ఉత్పత్తులను కొరియర్‌ ద్వారా తెప్పించుకొని అమెరికాలో సోషల్‌ మీడియాలో ఆర్డర్లు తీసుకొని కొనుగోలుదార్లకు కొరియర్ ద్వారా డెలివరీ చేస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి వాటి మీద అమెరికా ప్రభుత్వం పన్నులు వసూలు చేసిన దాఖలాలు లేవు. అలానే యాప్‌ల ద్వారా జరిగే వ్యాపారాల మీద కూడా ఎలాంటి పన్నులేదు. ఇప్పుడు ట్రంప్ సర్కార్ కన్ను ఇలాంటి వారి మీద పడింది. ఇలా ఆన్లైన్, యాప్‌ల ద్వారా విక్రయించేవారితోపాటు, కొనుగోలుదార్ల మీద కూడా సుంకాలు విధించాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా భారత్‌లోని రిటైలర్ల నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తులు తెప్పించుకుంటున్న షిప్మెంట్లను అధికార వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు పలువురికి భారీ జరిమానాలు, న్యాయపరమైన చర్యలకు సంబంధించి నోటీసులు పంపుతున్నాయి.అయితే ఇప్పటి వరకు చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఇలా నోటీసులు అందాయి.

Read Also: IMF Board: కేంద్రం కీలక నిర్ణయం..ఐఎంఎఫ్ బోర్డు సభ్యుడి తొలగింపు

#CustomDuties #ImportTax #OnlineShopping #PersonalImports #SocialMediaSales #USCustoms #USRegulations Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.