📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IPL 2025: ఆర్ సిబి ఫైనల్‌కు చేరుకుంటే భారత్‌కు వస్తా: ఏబీ డివిలియర్స్

Author Icon By Anusha
Updated: May 18, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఈ సారి అద్భుతంగా ఆడుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌లో కూడా తన స్థానాన్ని దాదాపుగా నిర్ధారించుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ప్రస్తుతం ఆర్సీబీ 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360, ఆర్సీబీ గ్రేట్ ఏబీ డివిలియర్స్(AB deVilliers) మాట్లాడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్‌కు చేరుకుంటే తాను కచ్చితంగా భారత్‌కు వస్తానని చెప్పాడు. ఐపీఎల్ ఫైనల్ జూన్ 3న జరగనుంది. ప్లేఆఫ్స్ మే 29 నుంచి ప్రారంభమవుతాయి. క్వాలిఫయర్ 1, ఎలిమిటర్ వరుసగా మే 29, 30 తేదీలలో జరుగుతాయి. క్వాలిఫయర్ 2 జూన్ 1న జరగనుంది. ప్లేఆఫ్స్ స్థానాలు ఇంకా నిర్ణయించబడలేదు.ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో 11 సంవత్సరాలు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. ఏబీ డివిలియర్స్ 2011 నుంచి 2021 వరకు ఆర్సీబీ జట్టు తరఫున ఆడాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) ఏబీడీకి ఎన్నో చిరస్మరణీయ పార్టనర్ షిప్‌లు ఉన్నాయి. ఒకప్పుడు ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ప్రమాదకరమైన బ్యాటర్లు ఉండేవారు. ఇప్పుడు కూడా కోహ్లీ ఆర్సీబీ జట్టులోనే ఉన్నాడు. అయితే దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఒక్కసారి కూడా ఆర్సీబీ తరఫున ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శనను చూసి తన సన్నిహితుడు విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ ట్రోఫీని ఎత్తాలని కోరుకుంటున్నానని ఏబీ డివిలియర్స్ అన్నాడు. కాబట్టి ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంటే ఏబీ డివిలియర్స్ ఖచ్చితంగా ఇండియాకు వస్తాడు.

IPL 2025: ఆర్ సిబి ఫైనల్‌కు చేరుకుంటే భారత్‌కు వస్తా: ఏబీ డివిలియర్స్

ఆనందం

నా మాటలను గుర్తుంచుకోండి, ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంటే, నేను జట్టుతో కలిసి స్టేడియంలో ఉంటాను’అని ఏబీ డివిలియర్స్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్(Instagram Live)లోఈ సందర్భంగా అన్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఐపీఎల్ ట్రోఫీని ఎత్తడం కంటే అంతకు మించిన ఆనందం మరొకటి లేదని, తాను చాలా సంవత్సరాలుగా దీని గురించి ప్రయత్నిస్తున్నానని ఏబీడీ వ్యాఖ్యానించాడు.

Read Also : Sports: ధోనీకి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారు:హర్భజన్ సింగ్

#ABdeVilliers #IPL2025 #Mr360 #RCB #ViratKohli Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.