📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor: ‘భారత్​కు అండగా నిలబడాలి’- యూకే ఎంపీ ప్రీతి పటేల్

Author Icon By Vanipushpa
Updated: May 8, 2025 • 1:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ముకశ్మీర్​లోని పహల్గాంలో ఉగ్రదాడిని యూకే ఎంపీ ప్రీతి పటేల్ ఖండించారు. ఉగ్రవాదాన్ని నిరోధించడానికి భారత్​కు అందించే సహకారాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద స్థావరాల ముప్పును గుర్తించాలని కోరారు. ఈ మేరకు యూకే హౌస్ ఆఫ్ కామన్స్​లో ఆమె మాట్లాడారు.
శాంతి- భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి సహకరించాలి
“ఈరోజు హౌస్ ఆఫ్ కామన్స్​లో పహల్గాంలో జరిగిన దారుణం వల్ల ప్రభావితమైన వారికి నా సంతాపాన్ని పునరుద్ఘాటించాను. ఉగ్రవాదం వల్ల ప్రభావితమైన వారికి అంకా అండగా నిలబడాలి. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి- భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి భారత్​తో బ్రిటన్ ప్రభుత్వం పనిచేయాలి” అని ప్రీతి పటేల్ ఎక్స్​లో పిలుపునిచ్చారు.

Operation Sindoor: ‘భారత్​కు అండగా నిలబడాలి’- యూకే ఎంపీ ప్రీతి పటేల్

పహల్గాంలో హింసాత్మక ఉగ్రవాదం
“ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యటకులను క్రూరంగా, దారుణంగా చంపారు. చాలా మంది బాధితుల తలలపై తుపాకీ గురిపెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో చంపేశారు. పహల్గాంలో హింసాత్మక ఉగ్రవాదం వల్ల ప్రభావితమైన వారందరితో నా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి. పహల్గాం ఇప్పుడు ఉగ్రవాద చర్యల వల్ల ప్రభావితమైన ముంబయి, దిల్లీ వంటి భారతీయ నగరాల జాబితాలో చేరింది” అని ప్రీతి పటేల్ వ్యాఖ్యానించారు.
ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశం అది
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని చెబుతూనే, పాక్​ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు ఎదుర్కొంటున్న ముప్పును UK గుర్తించాలని ప్రీతి చెప్పారు. ఒసామా బిన్ లాడెన్ దాక్కున్న దేశం అదని వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి తర్వాత బ్రిటిష్ భారత్​కు ఏదైనా భద్రతా సహాయం అందించిందా అని ప్రీతి పటేల్ ప్రశ్నించారు.

Read Also: All-Party Meeting: ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష సమావేశం

'We must stand by India' #telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today UK MP Priti Patel

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.