📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

JaiShankar :డాలర్ ను బలహీనపరిచే భావన మాకు లేదు: జైశంకర్

Author Icon By Anusha
Updated: March 22, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం డాలర్ ని బలహీనపరిచే ప్రయత్నాలు చేయలేదని, బ్రిక్స్ సభ్య దేశాల ఉమ్మడి కరెన్సీపై భారత్ ప్రమేయం లేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టంగా వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో భారతదేశం సమతుల్యతను పాటించే దౌత్య విధానాన్ని అనుసరిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ట్రంప్ హెచ్చరికలపై జైశంకర్ స్పందన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో బ్రిక్స్ దేశాలు డాలర్‌ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తే వాణిజ్య సుంకాలను పెంచుతామని హెచ్చరించారు. దీనిపై భారత ప్రభుత్వ వైఖరి ఏమిటని పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇచ్చారు.బ్రిక్స్ రెండు దశాబ్దాలుగా ఆధారంగా సభ్యత్వం, ఎజెండా విస్తరిస్తున్న వేదిక. అంతర్జాతీయ సమాజంలో బ్రిక్స్ కార్యకలాపాలపై అవగాహన పెంచేలా మా ప్రయత్నాలు ఉన్నాయి. ఈ కూటమి తన సభ్యుల ఉమ్మడి ఆందోళనను ప్రతిబింబిస్తుంది. ప్రపంచ దేశాలతో కలిసి ముందుకువెళ్తుంది. ప్రపంచ దేశాలతో కలిసి ముందుకు వెళ్లడమే లక్ష్యం.

బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీ

డాలర్ బలహీనపరిచే ప్రయత్నాల్లో, బ్రిక్స్కు కామన్ కరెన్సీని తీసుకురావడంలో భారత్ ప్రమేయం లేదు” అని ట్రంప్ సుంకాల ముప్పు గురించి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానం ఇచ్చారు.అలాగే, భారతదేశం ఇప్పటికే అమెరికాతో జరిపిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా డాలర్‌ బలహీనపరిచే ఎలాంటి ఉద్దేశం భారత్ కు లేదని స్పష్టంచేశారు.

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం

గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఉమ్మడి కరెన్సీ ప్రస్తావన వచ్చింది.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ అంశంపై గట్టి ప్రస్తావన చేస్తూ,బ్రిక్స్ దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలి,డిజిటల్ కరెన్సీ వినియోగంపై భారత్‌తో కలిసి రష్యా పనిచేస్తోంది”, అని అన్నారు.అయితే, భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై ఇప్పటివరకు ఓపెన్ గా స్పందించలేదు.కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని పుతిన్ కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామన్నారు.

జియో ఎకనామిక్స్ సెంటర్

అట్లాంటిక్ కౌన్సిల్‌కు చెందిన జియో ఎకనామిక్స్ సెంటర్ చేసిన అధ్యయనంలో,బ్రిక్స్ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాలర్‌పై ప్రపంచ దేశాలు ఆధారపడటం పూర్తిగా తగ్గించలేవని తేలింది.గ్లోబల్ ట్రేడ్‌లో డాలర్‌కి ఉన్న గట్టి పట్టు కారణంగా,ఏదైనా కొత్త కరెన్సీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావడం చాలా కష్టం.

అమెరికా వాణిజ్య విధానం

బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీకిమద్దతు ఇస్తే,అమెరికా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు.బ్రిక్స్ దేశాలు డాలర్‌ను అడ్డుకోవడానికి ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకువస్తే, వాటిపై 100% సుంకాలు విధిస్తా”, అని ట్రంప్ పేర్కొన్నారు.భారతదేశం ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని ప్రోత్సహించకుండా తటస్థ వైఖరిని పాటిస్తోంది. అయితే, అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ భవిష్యత్ విధానాలు ఏమిటనే అంశం ఆశక్తిగా మారింది.

#BRICS #CommonCurrency #Dollar #Geopolitics #GlobalEconomy #india #InternationalTrade #Jaishankar #Putin #Russia #US Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.