భారత యువ క్రికెట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తన అసాధారణ ప్రతిభను మళ్లీ నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదిక (Edgbaston Venue) గా జరుగుతున్న రెండో టెస్టులో గిల్ తన కెరీర్లోనే, భారత టెస్టు చరిత్రలోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. 269 పరుగులతో డబుల్ సెంచరీ సాధించిన గిల్, టెస్టుల్లో భారత కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును అధిగమించాడు. గతంలో విరాట్ 2019లో 254 నాటౌట్ చేసాడు.గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ సిరీస్లో ఆ ఒత్తిడిని పక్కనపెట్టి
ఈ మ్యాచ్లో గిల్ చూపించిన ఆటతీరు అభిమానులకే కాకుండా మాజీ క్రికెటర్ల ప్రశంసలు కూడా అందుకున్నాడు.ఇలా తన కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన అనంతరం శుభ్మన్ గిల్ తన విజయం వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. “కొంతకాలంగా పరుగుల ఒత్తిడితో బ్యాటింగ్ను ఆస్వాదించలేకపోయాను. ఈ సిరీస్ (Series) లో ఆ ఒత్తిడిని పక్కనపెట్టి, చిన్నప్పుడు ఆడినట్లుగా స్వేచ్ఛగా ఆడాలనుకున్నాను. అదే నాకు బాగా కలిసొచ్చింది” అని గిల్ తెలిపాడు. తన బేసిక్ మూవ్స్, సెటప్పై దృష్టి సారించడం కూడా ఫామ్లోకి రావడానికి దోహదపడిందని వివరించాడు.
క్రీజులో కుదురుకుంటే
తొలి రోజు ఆటలో పరుగులు చేయడానికి కాస్త ఇబ్బంది పడినప్పుడు, గౌతమ్ గంభీర్తో మాట్లాడానని గిల్ (Shubman Gill) వెల్లడించాడు. “వికెట్ బాగున్నప్పుడు క్రీజులో కుదురుకుంటే, ఎంతసేపైనా బ్యాటింగ్ చేయాలని, సులభంగా వికెట్ చేజార్చుకోకూడదని నిర్ణయించుకున్నాను. గత మ్యాచ్ అనుభవం నాకు ఈ విషయంలో ఉపయోగపడింది” అని అన్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సేనా (SENA) దేశాల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్గా గిల్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: IND vs ENG: ఫోకస్ వల్లే రికార్డు ఇన్నింగ్స్ సాధ్యమైంది: గిల్