📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Virat Kohli: లండ‌న్‌లోని కోహ్లీ ఇంట్లో గడిపిన భారత క్రికెటర్లు

Author Icon By Anusha
Updated: June 18, 2025 • 12:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, జట్టుతో ఆయనకున్న అనుబంధం అలాగే కొనసాగుతోంది.కాగా, భారత జట్టు త్వరలో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా జూన్ 20 నుంచి ఐదు టెస్టు మ్యాచ్‌ (Test match) లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ హెడింగ్లీలో ప్రారంభం కానుంది. ఈ కీలకమైన సిరీస్‌కు ముందు భారత జట్టు కొత్త‌ టెస్ట్ కెప్టెన్ శుభమన్‌ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్‌ పంత్‌, పేసర్ మహ్మద్‌ సిరాజ్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లను కోహ్లీ (Virat Kohli) లండన్‌లోని తన నివాసానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ సెలక్టర్లు

వీరంతా కోహ్లీ ఇంట్లో కొన్ని గంటల పాటు ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారని సమాచారం.టెస్ట్ కెప్టెన్‌గా గిల్‌కు ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం. ఐపీఎల్ (IPL) సీజన్ మధ్యలో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీసీసీఐ సెలక్టర్లు యువ ఆటగాడైన గిల్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఈ ఇంగ్లండ్ సిరీస్‌తోనే టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కొత్త సైకిల్‌ను ప్రారంభించనుంది. గత డబ్ల్యూటీసీ సీజన్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని అందరూ భావించినప్పటికీ చివరికి నిరాశే ఎదురైంది.

Virat Kohli

టీమిండియా విజయం

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకంగా మారింది. కొత్త డబ్ల్యూటీసీ సీజ‌న్‌ను టీమిండియా (TeamIndia) విజయంతో ప్రస్థానం మొదలుపెట్టాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. కోహ్లీ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడితో యువ ఆటగాళ్లు సమయం గడపడం, వారి మధ్య చర్చలు జరగడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Virat Kohli : గిల్-పంత్‌తో కోహ్లీ మీటింగ్..

# virat kohli #INDvsENG #TeamIndia #TestCricket #WTC2025 Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.