ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు (యూరోపియన్ యూనియన్, అమెరికా, బ్రిటన్ మొదలైనవి) రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా చమురు, గ్యాస్ వంటి శక్తి వనరులపై ఆ ఆంక్షలు దృష్టి సారించాయి. అయితే ఈ ఆంక్షల మధ్య భారత్ రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి (Import of oil) చేసుకుంటోంది. ఇది పశ్చిమ దేశాలకు అసంతృప్తిని కలిగించింది.పశ్చిమ దేశాలు రష్యా చమురు కొనుగోలును కొనసాగించడం ద్వారా ఆ దేశానికి ఆదాయం లభిస్తున్నదని, అది యుద్ధానికి నేరుగా మద్దతుగా మారుతుందని ఆరోపిస్తున్నాయి. వారు భారత్ను కూడా రష్యా చమురును తగ్గించమని సూచిస్తున్నారు. దీనిపై తాజాగా భారత్ స్పందించింది. పశ్చిమ దేశాల విమర్శలను యూకేలోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి (Vikram Doraiswami) తోసిపుచ్చారు. ఏ దేశం కూడా తమ ఆర్థిక వ్యవస్థను ఆపేయాలని అనుకోదని వ్యాఖ్యానించారు.

బ్రిటిష్ రేడియో స్టేషన్ టైమ్స్ రేడియోతో దొరైస్వామి (Vikram Doraiswami) మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అని తెలిపారు. దేశ అవసరాల్లో 80 శాతం దిగుమతులపైనే అధారపడుతున్నట్లు చెప్పారు. రష్యా నుంచి చౌక ధరకు చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. అవసరాల మేరకు డిస్కౌంట్పై చమురును ఎలా కొనుగోలు చేయకుండా ఉంటాం..? అని ప్రశ్నించారు. పశ్చిమ దేశాలు భారత్పై విమర్శలు చేస్తున్నాయన్నారు. ‘మేం ఏం చేయాలని పశ్చిమ దేశాలు కోరుకుంటున్నాయి..? మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాలా..?’ అంటూ ప్రశ్నించారు.భారత్ తన చమురు దిగుమతుల విషయంలో స్పష్టమైన ధోరణిని తీసుకుంది. దేశ శక్తి భద్రత, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా, ఏ దేశం నుండైనా తక్కువ ధరలో నాణ్యమైన సరఫరా లభిస్తే, దానిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వ వాదన.
విక్రమ్ దొరైస్వామి ఆసక్తులు ఏమిటి?
విక్రమ్ దొరైస్వామికి చదవడం, క్రీడలు, ఫిట్నెస్, ప్రయాణం, చరిత్ర మరియు జాజ్ వంటి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అతను ఆసక్తిగల పాఠకుడు మరియు పిజి వోడ్హౌస్ రచనలకు దీర్ఘకాల అభిమాని. అతను చైనీస్, ఫ్రెంచ్ మరియు కొంత కొరియన్ మాట్లాడగలడు.
యూకేలో విక్రమ్ దొరైస్వామి ఎవరు?
విక్రమ్ కుమార్ దొరైస్వామి (జననం 11 జూలై 1969) భారత విదేశాంగ సేవలో ఒక భారతీయ దౌత్యవేత్త, ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో భారత హైకమిషనర్గా పనిచేస్తున్నారు. ఈ నియామకానికి ముందు, ఆయన బంగ్లాదేశ్కు భారత హైకమిషనర్గా మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా మరియు ఉజ్బెకిస్తాన్లకు భారత రాయబారిగా పనిచేశారు.
మాల్దీవులకు భారత హై కమిషనర్ ఎవరు?
మాల్దీవులకు భారత హైకమిషనర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన జి.బాలసుబ్రమణియన్ 1998లో ఇండియన్ ఫారిన్ సర్వీస్లో చేరారు. ఆయన మాస్కో, దుషాంబే, వాషింగ్టన్ డిసి మరియు బ్యాంకాక్లోని ఇండియన్ మిషన్లలో వివిధ హోదాల్లో పనిచేశారు, బ్యాంకాక్ మరియు మాస్కోలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా కూడా పనిచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Shashi Tharoor: అందరి చూపు పార్లమెంట్ చర్చల పైనే ..శశిథరూర్