విశాఖపట్నం యువ ఇంజినీర్ వెంకట చరణ్ తన పరిశోధన ప్రతిభతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తయారీ రంగంలో అత్యంత కీలకమైన అంశమైన ఫ్రిక్షన్ వెల్డింగ్పై చేసిన లోతైన పరిశోధనలు ఆయనకు అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక EB-1 గ్రీన్కార్డును అందజేసింది. సాధారణంగా ఈ గుర్తింపు నోబెల్ బహుమతి గ్రహీతలు, ఆస్కార్ అవార్డు విజేతలు, ఒలింపిక్స్ పతక విజేతల వంటి అసాధారణ ప్రతిభ గల వ్యక్తులకు మాత్రమే లభిస్తుంది. అలాంటి గౌరవాన్ని ఒక తెలుగు యువ ఇంజినీర్ వెంకట చరణ్ (Venkata Charan)పొందడం గర్వకారణంగా మారింది.ఈబీ-1 గ్రీన్కార్డ్ అనేది ఏదైనా ఒక రంగంలో అసాధారణమైన ప్రతిభ కనబరిచిన విదేశీయులకు అమెరికా ఇచ్చే శాశ్వత నివాస హోదా. దీనికి దరఖాస్తు చేసుకున్న వందలాది మంది నిపుణులతో వెంకట చరణ్ పోటీ పడ్డారు. అనేక దశల వడపోత అనంతరం, ఆయన పరిశోధనల ప్రాముఖ్యత, అంతర్జాతీయంగా ఆయనకున్న పేరును పరిగణనలోకి తీసుకుని అమెరికా ప్రభుత్వం ఆయన్ని ఈ గ్రీన్కార్డు (Green Card) కు ఎంపిక చేసింది.
ఈబీ-1 గ్రీన్కార్డు రావడానికి దోహదపడింది
వెంకట చరణ్ రాసిన పరిశోధన పత్రాలను 25 దేశాలకు చెందిన పరిశోధకులు సుమారు 400 సార్లు తమ అధ్యయనాల్లో ప్రస్తావించడమే ఆయన ప్రతిభకు నిదర్శనం.విమానాల తయారీ, భారీ వంతెనల నిర్మాణం, గ్యాస్ పైప్లైన్ల ఏర్పాటు వంటి అత్యంత కీలకమైన పనుల్లో వెల్డింగ్ నాణ్యత చాలా ముఖ్యం. వెల్డింగ్ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఫ్రిక్షన్ వెల్డింగ్ (Friction welding) పై చరణ్ చేసిన పరిశోధనలు సరికొత్త మార్గాన్ని చూపాయి. ఇది కూడా ఆయనకు ఈబీ-1 గ్రీన్కార్డు రావడానికి దోహదపడింది.వెంకట చరణ్ విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో బీఈ పూర్తి చేశారు. 15 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి, అక్కడ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థలో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ హోదాలో పనిచేస్తున్నారు.

ఐదు పాఠ్య పుస్తకాల్లో కొన్ని అధ్యాయాలను సైతం రచించారు
అంతర్జాతీయంగా 20కి పైగా జర్నల్స్లో ఆయన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఐదు పాఠ్య పుస్తకాల్లో కొన్ని అధ్యాయాలను సైతం రచించారు. అమెరికా సొసైటీ ఫర్ క్వాలిటీ (ఏఎస్క్యూ), సొసైటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీర్స్ (ఎస్ఎంఈ) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సభ్యుడిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం ఎస్ఎంఈ (SME) నుంచి ఉత్తమ యువ ఇంజినీర్ అవార్డును కూడా అందుకున్నారు.అంతర్జాతీయంగా 20కి పైగా జర్నల్స్లో ఆయన పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఐదు పాఠ్య పుస్తకాల్లో కొన్ని అధ్యాయాలను సైతం రచించారు. అమెరికా సొసైటీ ఫర్ క్వాలిటీ (ఏఎస్క్యూ), సొసైటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీర్స్ (ఎస్ఎంఈ) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో సభ్యుడిగా ఉన్నారు. రెండేళ్ల క్రితం ఎస్ఎంఈ నుంచి ఉత్తమ యువ ఇంజినీర్ అవార్డును కూడా అందుకున్నారు.
Read Also: Kakinada: 48 గంటల్లోనే బాలిక మిస్సింగ్ కేసు చేధించిన పోలీసులు