ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా భారతీయ సమాజంలో కూడా కలకలం రేపుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.స్థానిక పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 12వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 12:50 గంటల సమయంలో) ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఈ చోరీకి పాల్పడ్డారు. వారు చాలా ప్లాన్ ప్రకారం.. మెటల్ కట్ చేసే ‘యాంగిల్ గ్రైండర్’ మిషన్తో విగ్రహాన్ని పాదాల దగ్గర కట్ చేసి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ ద్వారా తెలుస్తోంది.
Read Also: Delhi: రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

విగ్రహం మీద దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు
ఈ విగ్రహం మామూలుది కాదు. భారత ప్రభుత్వం (ICCR) తరపున ఆస్ట్రేలియా(Australia)కు బహుమతిగా ఇచ్చినది. 2021లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ దీనిని ఎంతో ఘనంగా ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహం మీద దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2021లో విగ్రహాన్ని ప్రతిష్టించిన కేవలం 24 గంటల్లోనే, కొందరు దుండగులు దీనిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ చర్యను రెండు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నే ఎత్తుకెళ్లడంతో దీని వెనుక ఏదైనా విద్వేషపూరిత కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఈ కాంస్య విగ్రహాన్ని ముక్కలుగా చేసి స్క్రాప్ వ్యాపారులకు అమ్మే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: