📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

America: తహవ్వుర్ రాణా అప్పగింతపై స్పందించిన యూఎస్

Author Icon By Vanipushpa
Updated: April 11, 2025 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబయి ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను భారత్​కు అప్పగించడంపై అమెరికా స్పందించింది. 26/11 ఉగ్రవాద దాడులు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయని వ్యాఖ్యానించింది. ఉగ్రదాడుల బాధ్యులకు తగిన శిక్ష పడేలా భారత్‌ చేస్తున్న ప్రతి పనికి అమెరికా మద్దతిస్తోందని వెల్లడించింది.
అమెరికా, భారత్ కలిసి పని చేస్తాయి
“భయంకరమైన 2008 ముంబయి ఉగ్రదాడుల్లో తహవ్వుర్ హుస్సేన్ రాణా ప్రమేయంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అతడిని భారత్​కు అప్పగించాం. ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అమెరికా, భారత్ కలిసి పని చేస్తున్నాయి. ముంబయి ఉగ్రదాడిలో ఆరుగురు అమెరికన్లు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకరమైన దాడులను కొంతమంది గుర్తుంచుకోకపోవచ్చు. కానీ ఈ ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది” అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్‌ వ్యాఖ్యానించారు.

బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా అడుగులు
తహవ్వుర్ రాణాను భారత్​కు అప్పగించడాన్ని ముంబయి దాడుల బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా వేసిన కీలకమైన అడుగుగా యూఎస్ డిపార్ట్​మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రతినిధి ఒకరు అభివర్ణించారు. ముంబయి ఉగ్రదాడుల్లో రాణా ప్రమేయంపై విచారణ జరిపేందుకు భారత్​కు అతడిని అప్పగించామని పేర్కొన్నారు.
ఈ కేసులో తహవ్వుర్ హుస్సేన్ రాణా తన సహ కుట్రదారు డేవిడ్ కోల్​మన్ హెడ్లీకి భారత వీసా పొందడానికి సహాయం చేశాడని ముంబయి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాణా పదేళ్ల వీసా పొడిగింపు పొందడానికి కూడా సాయపడ్డానని వెల్లడించారు.
సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ
భారత్​కు తనను అప్పగించవద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో రాణా వేసిన పిటిషన్‌ సైతం తిరస్కరణకు గురైంది. దీంతో అతడిని భారత్​కు తీసుకొచ్చేందుకు వీలుపడింది. ఈ క్రమంలోనే భారత్​కు చెందిన అధికారుల బృందం అగ్రరాజ్యానికి వెళ్లారు.

READ ALSO: Mumbai attack 26/11: ఎట్టకేలకు భారత్‌కు వచ్చిన తహవ్వుర్ రాణా..ఆ రోజు ఏం జరిగింది?

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Tahawwur Rana's extradition Telugu News online Telugu News Paper Telugu News Today US responds to

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.