📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Shashi tharoor: కొలంబియాలో శశిథరూర్ కు ఊహించని షాక్..!

Author Icon By Vanipushpa
Updated: May 30, 2025 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కశ్మీర్ లోని పహల్గాం(Pahalgam)లో ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)విజయవంతమైంది. ఆ దెబ్బకు పాకిస్తాన్(Pakisthan) తోక ముడిచింది. కాల్పుల విరమణకు వినతులు పంపడంతో భారత్ దాన్ని అంగీకరించి యుద్దాన్ని ముగించింది. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతు విషయంలో మాత్రం వెనక్కి తగ్గరాదని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐరాస భద్రతా మండలిలోని 15 సభ్యదేశాలతో పాటు భారత్ మిత్రదేశాలకు అఖిలపక్ష ఎంపీల బృందాల్ని పంపి పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతుని వివరిస్తోంది.

Shashi tharoor: కొలంబియాలో శశిథరూర్ కు ఊహించని షాక్..!

చనిపోయిన పాకిస్తాన్ పౌరులకు సంతాపం
ఇందులో భాగంగా అమెరికాతో పాటు దాని చుట్టుపక్కల దేశాల్లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని బృందానికి దక్షిణ అమెరికాలోని కొలంబియాలో అనుకోని షాక్ తగిలింది. పాకిస్తాన్ ఉగ్రచర్యల్ని వివరించి భారత్ కు మద్దతు సంపాదించేందుకు వెళ్లిన శశిథరూర్ బృందం తమ వివరణ ఇచ్చేలోపే కొలంబియా ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన పాకిస్తాన్ పౌరులకు సంతాపం ప్రకటించింది. దీంతో శశిథరూర్ బృందం షాకయ్యింది.
తమకు కాస్త నిరాశ కలిగింది:శశిథరూర్
భారత దాడుల తర్వాత పాకిస్తాన్‌లో జరిగిన ప్రాణనష్టానికి హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేసిన కొలంబియా ప్రభుత్వ ప్రతిస్పందన తమకు కాస్త నిరాశ కలిగించిందని ఈ సందర్భంగా శశిథరూర్ వెల్లడించారు. ఉగ్రవాద బాధితుల పట్ల సానుభూతి చూపడం కంటే కొలంబియాలోని తమ స్నేహితులకు ఉగ్రవాదులను పంపేవారికి, వారిని ప్రతిఘటించేవారికి మధ్య ఎటువంటి సమానత్వం ఉండదని తాము చెప్తామని థరూర్ తెలిపారు. దాడి చేసేవారికి, రక్షించేవారికి మధ్య ఎటువంటి సమానత్వం ఉండదన్నారు.
తాము తమకు ఉన్న ఆత్మరక్షణ హక్కును మాత్రమే వినియోగించుకుంటున్నట్లు థరూర్ తెలిపారు. అవాగే ఈ అంశంలో ఏదైనా అపార్థం ఉంటే, దాన్ని తొలగించడానికి తాము కొలంబియాకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే కొలంబియాకు వాస్తవ పరిస్దితుల్ని వివరిస్తామని ఆయన తెలిపారు.

Read Also: UN: శాంతిని పరిరక్షించడంలో భారత్ ను కొనియాడిన జీన్ పియర్

#telugu News Ap News in Telugu Breaking News in Telugu for Shashi Tharoor Google News in Telugu in Colombia..! Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Unexpected shock

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.