📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Attack: ఇండియా పాక్ లతో యూకే విదేశాంగ కార్యదర్శి చర్చలు

Author Icon By Vanipushpa
Updated: April 28, 2025 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాలు సరిహద్దుల వద్ద సైన్యాన్ని భారీ ఎత్తున్న మోహరిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ భయం నెలకొంది. ఈ నేపథ్యంలో యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్‌లతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఇండియా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగాయి.

లామీతో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని భారత విదేశాంత మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఈ రోజు యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో మాట్లాడాను. పహల్గామ్‌లో జరిగిన సరిహద్దు ఉగ్రవాద దాడి గురించి చర్చించాను. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రాముఖ్యతను వివరించాను” అని జైశంకర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఇండియా పలు కీలక నిర్ణయాలు
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగింది. ఈ దాడిలో ఒక నేపాల్ జాతీయుడు సహా 26 మంది మరణించారు. 2019 పుల్వామా దాడి తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. జమ్మూ కశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బైసారన్ మేడో సమీపంలో బాధితులు మరణించారు. అలాగే పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌తో యూకే విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం, శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌పై అనేక చర్యలు చేపట్టింది. 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, దౌత్య సంబంధాలను తగ్గించడం, అట్టారి సరిహద్దు క్రాసింగ్‌ను మూసివేయడం వాటిలో భాగమే. మరోవైపు పాకిస్తాన్ తన గగనతలంలోకి భారత విమానాలు రాకుండా నిషేధం విధించింది.
భారత్‌ ఏకపక్ష చర్యలపై పాకిస్తాన్ ఆందోళనల
అలాగే యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీతో జరిపిన చర్చలపై పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం భారత్‌ ఏకపక్ష చర్యలపై పాకిస్తాన్ ఆందోళనలను వ్యక్త పరిచినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ ఉగ్రదాడిని న్యూయార్క్‌లోని క్వీన్స్‌లోని దావూదీ బోహ్రా సమాజం, కెనడియన్ పౌరులు, నేపాల్ చట్టసభ సభ్యులు ఖండించారు, బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతదేశానికి మద్దతు ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తతలను పెంచింది. యూకే విదేశాంగ కార్యదర్శి, ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్చలను ప్రేరేపించారు. భారతదేశం, పాకిస్తాన్ పై కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పేందుకు దిశగా పని చేయాలని నాయకులు సూచిస్తున్నారు. ఈ రోజు యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో మాట్లాడాను. పహల్గామ్ దాడి గురించి చర్చించాను. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రాముఖ్యతను వివరించాను” అని జైశంకర్ ఎక్స్‌లో (తాత్కాలిక ట్విట్టర్) పేర్కొన్నారు.

Read Also: Houthi: అమెరికా వైమానిక దాడి పై హౌతీ ఆరోపణలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu holds talks Latest News in Telugu Pakistan Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today UK Foreign Secretary with India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.