అమెరికా(America) ఇప్పటికే ఉక్కు, అల్యూమినియం(Aluminium)పై సుంకాలను అనౌన్స్ చేసింది. ఇప్పుడు వాటికి తోడు రాగిని కూడా చేర్చారు అధ్యక్షుడు ట్రంప్(Trump). రాగిపై 50 శాతం సుంకాలను ప్రకటించారు. అలాగే అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాలపై సుంకాలు ఒక సంవత్సరం తర్వాత 200 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. ఇవన్నీ ఆగస్టు 1 నుంచి అమలు అవుతాయని తెలిపారు. ఇక బ్రిక్స్ దేశాల(Brics Countries)పై 10 శాతం సుంకం విధించడాన్ని ట్రంప్ మరోసారి సమర్థించుకున్నారు. ఈ దేశాలు అమెరికన్ డాలర్ ను సవాల్ చేస్తున్నాయని అన్నారు. వారు అలా చేసినా పర్వాలేదు కానీ సుంకాలు చెల్లించాల్పిందేనని తేల్చి చెప్పారు.
రాగి, ఫార్మా సుంకాలతో భారత్ పై భారీ ఎఫెక్ట్..
అమెరికా రాగి, ఫార్మాలపై విధించిన సుంకాలు మిగతా దేశాలతో పాటూ భారత్ పై కూడా అత్యంత ఎక్కువగా ప్రభావం చూపించనున్నాయి. ఎందుకంటే అమెరికాకు ఎక్కువగా రాగి, మందులను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ ఒకటి గా ఉంది. 2024-25లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా $2 బిలియన్ల విలువైన రాగి, దాని ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇందులో US మార్కెట్లకు ఎగుమతులు $360 మిలియన్లు లేదా 17 శాతంగా ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య డేటా ప్రకారం.. సౌదీ అరేబియా (26 శాతం) మరియు చైనా (18 శాతం రాగిని ఉత్పత్తి చేస్తుండగా..మూడో స్థానంలో భారత్ ఉంది. భారతదేశం రాగి ఎగుమతులకు అమెరికా మూడవ అతిపెద్ద మార్కెట్.

సుంకాల విషయంలో భారత్, అమెరికాకు మధ్య తీవ్ర చర్చలు
ఇక ఫార్మా విషయానికి వస్తే..రాగి కన్నా ఈ రంగం మరింత ఎఫెక్ట్ కానుంది. ఫార్మాపై 200 శాతం సుంకాలు విధించడం చాలా ఎక్కువ హాని కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా భారతదేశంలో అతిపెద్ద విదేశీ ఫార్మా మార్కెట్..2025లో ఈ ఎగుమతులు $9.8 బిలియన్లకు పెరిగాయి. గత ఏడాది $8.1 బిలియన్లు ఉండగా..ఇప్పుడు అది 21 శాతం పెరిగాయి. ఇది భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే ఫార్మా మొత్తం ఎగుమతుల్లో 40 శాతంగా ఉంది. ఈ రంగంపై 200 శాతం లెవీ విధించడం వల్ల డిమాండ్ తీవ్రంగా ప్రభావితమవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే సుంకాల విషయంలో భారత్, అమెరికాకు మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇవి మరో రెండు రోజుల్లో ఒక కొలిక్కి వస్తాయని తెలుస్తోంది. ఈ ఒప్పందాలు కనుక ఖరారు అయితే కొత్త సుంకాలు భారత మార్కెట్లపై ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు .
ట్రంప్ ఎలాంటి సుంకాలను విధించారు?
ట్రంప్ ఉక్కు మరియు అల్యూమినియం సుంకాలను 50%కి పెంచారు మరియు దిగుమతి చేసుకున్న కార్లపై 25% సుంకాన్ని ప్రవేశపెట్టారు. రాగిపై 50% సుంకాన్ని కూడా ప్రకటించారు మరియు భవిష్యత్ సుంకాలకు మద్దతుగా ఔషధాలు మరియు ఇతర రంగాలపై దర్యాప్తుకు ఆదేశించారు.
సుంకాలు అంటే ఏమిటి?
సుంకం అంటే వస్తువులు జాతీయ సరిహద్దుల మీదుగా రవాణా చేయబడినప్పుడు వాటిపై విధించే పన్ను, సాధారణంగా దిగుమతులపై. ఈ పన్నులు తరచుగా దేశీయ పరిశ్రమలను విదేశీ పోటీ నుండి రక్షించడానికి, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగించబడతాయి.
Read News hindi: hindi.vaartha.com
Read Also:Texas: టెక్సాస్లో భారీ వరదలు: మృతుల సంఖ్య 100 దాటింది