Latest Telugu news : Trump Golden Statue – అమెరికా క్యాపిటల్‌ భవనం వెలుపల ట్రంప్‌ బంగారు విగ్రహం

Read Time:  1 min
Trump Golden Statue - అమెరికా క్యాపిటల్‌ భవనం వెలుపల ట్రంప్‌ బంగారు విగ్రహం
Trump Golden Statue - అమెరికా క్యాపిటల్‌ భవనం వెలుపల ట్రంప్‌ బంగారు విగ్రహం
FONT SIZE
GET APP

అమెరికా క్యాపిటల్ (US Capitol) భవనం వెలుపల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు విగ్రహాన్ని (Trump Golden Statue) ఏర్పాటు చేశారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఎట్టకేలకు వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. దాదాపు 9 నెలల తర్వాత అంచనాలకు తగ్గట్టుగానే కీలక వడ్డీరేటుకు పావు శాతం (25 బేసిస్‌ పాయింట్లు) కోత పెట్టింది. తాజా నిర్ణయంతో ప్రస్తుతం వడ్డీరేట్ల శ్రేణి 4-4.25 శాతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా క్యాపిటల్ భవనం వెలుపల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారు విగ్రహాన్ని (Trump Golden Statue) ఏర్పాటు చేశారు. బిట్‌కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Trump Golden Statue - అమెరికా క్యాపిటల్‌ భవనం వెలుపల ట్రంప్‌ బంగారు విగ్రహం
Trump Golden Statue – అమెరికా క్యాపిటల్‌ భవనం వెలుపల ట్రంప్‌ బంగారు విగ్రహం

డిజిటల్‌ కరెన్సీ భవిష్యత్తు, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లలో ప్రభుత్వ పాత్ర గురించి చర్చించుకునేందుకే ఈ భారీ బంగారు విగ్రహం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ విగ్రహానికి క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. ట్రంప్‌ బంగారు విగ్రహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇదిలావుంటే ఈ ఏడాది మరో రెండుసార్లు వడ్డీరేట్లను ఫెడ్‌ తగ్గించే వీలుందన్న అంచనాలున్నాయి.

ట్రంప్ విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు?

డాన్ కొలోసస్, అలాన్ కాట్రిల్ రూపొందించిన 2025 కాంస్య శిల్పం.

ఈ విగ్రహాల ప్రయోజనం ఏమిటి?

విగ్రహాలు లోతైన సాంస్కృతిక మరియు సామాజిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి, గుర్తింపు, గర్వం మరియు సామూహిక జ్ఞాపకశక్తికి చిహ్నాలుగా పనిచేస్తాయి. అవి ఒక సమాజం యొక్క విలువలు, నమ్మకాలు మరియు ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి, దాని హీరోలను జరుపుకుంటాయి మరియు దాని ఉమ్మడి చరిత్రను స్మరించుకుంటాయి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విగ్రహం ఏది?

“వేలుతో ఉన్న మనిషి”; పాయింటింగ్ మ్యాన్ లేదా మ్యాన్ పాయింటింగ్ అని కూడా పిలుస్తారు) అనేది 1947లో ఆల్బెర్టో గియాకోమెట్టి రూపొందించిన కాంస్య శిల్పం, ఇది మే 11, 2015న US$141.3 మిలియన్లకు అమ్ముడైనప్పుడు ఇప్పటివరకు అత్యంత ఖరీదైన శిల్పంగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/donald-trump-trump-declares-antifa-a-terrorist-organization/international/549748/

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.